శర్వానంద్ తో ఢీ కొడుతున్న మెగా విలన్!
on Aug 4, 2016
"రేసుగుర్రం" సినిమాలో మద్దాలి శివారెడ్డి అనే పొలిటీషియన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అమితంగా అలరించడంతోపాటు సదరు సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన భోజ్ పురి నటుడు రవికిషన్ ఆ సినిమాతో తెలుగులోనూ బిజీ అయిపోయాడు. రీసెంట్ గా సుప్రీమ్ హీరో సాయిధరమ్ నటించిన "సుప్రీమ్" సినిమాలోనూ కామెడీ విలన్ గా నటించి ఆడియన్స్ ను ఆకట్టుకొన్నాడు. దాంతో మనోడికి మెగా విలన్ అనే ట్యాగ్ పడిపోయింది.
ఇప్పుడీ బోజ్ పురి మెగాస్టార్ శర్వానంద్ సినిమాలోనూ విలన్ గా ఎంపికయ్యాడని సమాచారం. మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుండగా.. రవికిషన్ ఓ మాఫియా డాన్ గా కనిపించనున్నాడట. అయితే.. మాఫియా డాన్ అనగానే ఏదో పదిమందిని వెనకేసుకొని తిరిగే రెగ్యులర్ విలన్ గా కాకుండా చాలా టిపికల్ రోల్ ప్లే చేస్తున్నాడట. శర్వానంద్ నటిస్తున్న ఈ 25వ చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు!