అదంతా.. పుకారేనట!
on Jun 21, 2016
రామ్చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ చిత్రం తని ఒరువన్కి ఇది రీమేక్. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. అయితే ఈ సినిమాలో కాజల్ కూడా ఉందని, కాజల్, చరణ్పై ఓ ఐటెమ్ సాంగ్ తెరకెక్కిస్తారని చెప్పుకొన్నారు. వాళ్లిద్దరు కలిసి నటించిన చిత్రాలు మంచి విజయం కావడంతో.. అదే సెంటిమెంట్ తో కాజల్ని ఐటెమ్ సాంగ్ కి ఒప్పించారన్న గుసగుసలు వినిపించాయి. అయితే... అదంతా ఒట్టి పుకారే అని తేలింది. ఈ సినిమా కోసం కాజల్ని సంప్రదించలేదని, అసలు ఐటెమ్ సాంగ్ ఆలోచనే లేదని చిత్రబృందం చెబుతోంది. అలాంటప్పుడు... ఈ పుకారు ఎలా పుట్టిందో మరి. అయినా.. ఈ మధ్య కాలంలో ఇలాంటి రూమర్స్ ఎక్కువైపోయాయి. బాహుబలి సినిమాలో ప్రియమణి ఉందని, నాగార్జున 'హాథిరామ్ బాబా' సినిమాలో ప్రగ్య జైస్వాల్ నటిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే ఏ ఒక్కదానిలో నిజంలేదు. ఎవరో కావాలని పుట్టిస్తోన్న పుకార్లను మీడియా సైతం నిజమని రాయడం ఆశ్చర్యకరం.