తమన్నాతో సత్తారు వెబ్ సిరీస్!
on Aug 11, 2020
వెబ్ సిరీస్లో నటించడానికి తాను సిద్ధమని తమన్నా ఎప్పుడో ప్రకటించింది. అయితే, ఇప్పటివరకూ ఎవరూ ఆమెకు నచ్చిన కథతో వెళ్లినట్టు లేదు. గతంలో తమన్నాతో ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తీయడానికి తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎవరో ప్రయత్నాలు చేశారు. కానీ, పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా ఉన్నాయని సమాచారం.
‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్’, ‘గరుడవేగ’ చిత్రాలు తీసిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తమన్నా కాంబినేషన్లో ఓ వెబ్ సినిమా లేదా సిరీస్కి ‘ఆహా’ ఓటీటీ రూపకల్పన చేస్తోంది. ప్రస్తుతం డిస్కషన్లు జరుగుతున్నాయి. త్వరలో ఓ కొలిక్కి వచ్చేలా ఉన్నాయట. ఇప్పటివరకూ ఓటీటీ ప్రాజెక్ట్స్ ఏవీ తమన్నా చేయలేదు. ఇదే ఆమెకు తొలి ఓటీటీ ప్రాజెక్ట్ అవుతుంది. మరోవైపు నాగార్జున హీరోగా సినిమా చేసే ఛాన్స్ ప్రవీణ్కి వచ్చింది. ఆ సినిమా తర్వాతే తమన్నాతో ప్రాజెక్ట్ ఉంటుందట.