ఆ సింగర్కి విజయ్ దేవరకొండ స్పెషల్
on Jun 3, 2020
సిద్ శ్రీరామ్ గళంలో ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు ప్రేక్షకులను అతడి గాత్రం అమితంగా ఆకట్టుకుంది. రెండు మూడేళ్లుగా చార్ట్ బస్టర్లుగా నిలిచిన గీతాలలో అతడు పాడినవి తప్పకుండా కొన్ని ఉంటాయి. అందులో విజయ్ దేవరకొండ, సిద్ శ్రీరామ్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ అనే చెప్పాలి. వీళ్లిద్దరి కాంబినేషన్లో 'గీత గోవిందం'లో 'ఇంకేం ఇంకేం కావాలే... చాల్లే ఇది చాల్లే', 'వచ్చిందమ్మా' పాటలు, 'టాక్సీవాలా'లో 'మాటే వినదుగా మాటే వినదుగా' పాట, 'డియర్ కామ్రేడ్' సినిమాలో 'కడలల్లే' పాట వచ్చాయి. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా తమిళనాడులో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మీ వాయిస్ ఎవరికి సూట్ అవుతుంది?' అని సిద్ శ్రీరామ్ ను అడగగా విజయ్ దేవరకొండ పేరే చెప్పాడు.
"విజయ్ దేవరకొండ, నాకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. తమిళంలో నా పాటలను మాంటేజ్ సీన్స్ లో ఉపయోగించారు. 'అచ్చం ఎన్బందు మడమియాడ'లో 'తల్లి పొగాదె' (శింబు హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో తమిళ వెర్షన్ లో 'వెళ్ళిపోమాకే') పాటలో కొన్ని లైన్స్ మాత్రమే శింబు పాడాడు. 'విశ్వాసం' సినిమాలో 'కణ్ణనా కణ్ణే' పాటలో నా వాయిస్ అజిత్ సార్ కి ఉపయోగించారు. సో... తమిళంలో నా వాయిస్ అజిత్ సార్ కి సూట్ అవుతుంది" అని సిద్ శ్రీరామ్ చెప్పాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన అనువాద సినిమాల్లో పాటల ద్వారా సిద్ శ్రీరామ్ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యాడు. 'నిన్ను కోరి' అతడికి స్ట్రయిట్ తెలుగు సినిమా. అందులో 'అడిగా అడిగా' పాట పాడాడు. తర్వాత పలు హిట్ సాంగ్స్ పాడాడు.