మీడియా మీద కేసు పెట్టిన హీరో
on Aug 12, 2020
నటుడు ఆదిత్యా పంచోలి తనయుడు, ‘హీరో’ సినిమాలో బాలీవుడ్కి హీరోగా పరిచయమైన సూరజ్ పంచోలి మీడియా మీద కేసు పెట్టారు. ముంబయ్లోని వెరసోవా పోలీస్ స్టేషన్లో తనను వేధిస్తున్న మీడియా సంస్థలు, సోషల్ మీడియా ్క్ష యుట్యూబ్ ఎకౌంట్స్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కంటే ముందు అతని మాజీ మేనేజర్ దిశా షాలినీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు ఆత్మహత్యలకు, సూరజ్ పంచోలికి సంబంధం ఉందని కొందరు కామెంట్లు చేశారు. దిశా షాలినీ, సూరజ్ పంచోలి స్నేహితులని ఒక మీడియా సంస్థ ఫొటోతో సహా కథనం ప్రసారం చేశాయి. అప్పట్లో సూరజ్ వివరణ ఇచ్చారు. మీడియా సంస్థ పేర్కొన్నట్టు ఆమె సుశాంత్ మేనేజర్ కాదనీ, తన స్నేహితురాలనీ చెప్పారు. తనను వేధించడం ఆపాలని కోరారు. ఇప్పుడు కేసు పెట్టారు. పుకార్లు ప్రసారం చేస్తున్న మీడియా వల్ల సూరజ్ మానసికంగా ఎంతో సతమతం అవుతున్నాడని అతని స్నేహితులు పేర్కొన్నారు.
Also Read