మహర్షితో ` సీత` రాత మారినట్టేనా!!
on May 8, 2019
కాజల్ అగర్వాల్ , బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `సీత`. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఈ శుక్రవారం విడుదల కాబోతున్న మహేష్ మహర్షి ఆడే థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా సీత యూనిట్ ప్రకటించింది. దీంతో సీత సినిమాకు మంచి బజ్ వచ్చేసింది. ఇక మహర్షి సినిమా ఆడే థియేటర్స్ లో ట్రైలర్ ప్రదర్శిస్తే ఎంత క్రేజ్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. వరుస ప్లాపులతో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అనగానే పెద్దగా సినిమా పై క్రేజ్ లేదు. ఏదో కాజల్, దర్శకుల క్రేజ్ మీదనే సినిమాకు ఇంత కాలం ఒక గుర్తింపు వచ్చింది. ఇక మహర్షి ఈ సినిమాకు మరింత క్రేజ్ ని తేనున్నాడు. మహేష్ బాబు నెక్ట్స్ సినిమా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మిస్తోంది. సీత కూడా ఏకే బేనర్ లో నిర్మితమైంది కాబట్టి ఈ విధంగా మహేష్ మహర్షి ని వాడేసుకుంటున్నారు ఏకే వారు అంటున్నారు సినీ జనాలు. మరి సీతతో అయినా బెల్లంకొండ శ్రీనివాస్ రాత మారుతుందో లేదో చూడాలి మరి.
Also Read