పవన్, మహేశ్.. ఫస్ట్ ఎవర్ పొంగల్ క్లాష్!
on Mar 1, 2021
అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటు సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఇద్దరు కూడా పలు సార్లు సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలతో సందడి చేశారు. అయితే, ఏ పొంగల్ సీజన్ లోనూ ఈ ఇద్దరి చిత్రాల మధ్య పోటీ లేదనే చెప్పాలి. కట్ చేస్తే.. 2022 ముగ్గుల పండక్కి పవన్, మహేశ్ తొలిసారి నువ్వా నేనా అన్నట్లుగా బరిలోకి దిగుతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. `భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న `సర్కారు వారి పాట`ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. కాగా, తాజాగా పవన్ కళ్యాణ్, వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న పేరు నిర్ణయించని పిరియడ్ డ్రామాని సంక్రాంతి సీజన్ లో విడుదల చేయబోతున్నట్లు సదరు చిత్ర బృందం పేర్కొంది.
దీంతో.. పవన్, మహేశ్ చిత్రాల మధ్య క్లాష్ ఉండబోతున్న విషయం స్పష్టమైంది. మహేశ్ ఇప్పటికే సంక్రాంతి స్టార్గా పేరు తెచ్చుకోగా, పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా మూడు సార్లు సంక్రాంతి బరిలో నిలిచినా, ప్రేక్షకుల్ని ఏమంతగా అలరించలేకపోయారు. మరి.. ఫస్ట్ టైమ్ పొంగల్ ఫైట్లో నిలుస్తున్న ఈ ఇద్దరిలో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.