'అర్జున్రెడ్డి' అభిమానులు సమంతను టార్గెట్ చేశారు!
on Jul 8, 2019
'అర్జున్రెడ్డి' సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ కొందరున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ సినిమాను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోరు. అన్నవాళ్లను టార్గెట్ చేస్తూ వరుస కామెంట్స్తో విరుచుకుపడతారు. నెట్టింట్లో కొందరికి 'అర్జున్రెడ్డి' అంటే అంత అభిమానం. ఈ అభిమానానికి తోడు 'అర్జున్రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' విడుదల తర్వాత నార్త్, సౌత్ అనే డివిజన్ వచ్చింది. క్రిటిక్స్ కావాలని దర్శకుడు సందీప్రెడ్డి వంగా తీసిన సినిమాకు నెగిటివ్ రేటింగ్స్ ఇచ్చారనే అభిప్రాయం తెలుగు ఆడియన్స్, రివ్యూ రైటర్లలో ఉంది. సందీప్రెడ్డి వంగాను టార్గెట్ చేస్తూ, 'అర్జున్రెడ్డి'ని టార్గెట్ చేస్తూ రివ్యూలు రాయడం బాగోలేదని ఎప్పుడో సోషల్ మీడియాలో బాలీవుడ్ క్రిటిక్స్పై సెటైర్లు వేశారు. లేటెస్టుగా హిందీ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్రెడ్డి కూడా క్రిటిక్స్పై సెటైర్లు వేశారు. హీరోయిన్ని హీరో కొట్టే సీన్ గురించి మాట్లాడుతూ "గాఢమైన ప్రేమలో ఉన్నప్పుడు ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ లేకపోతే ఎమోషన్ ఏం ఉన్నట్టు? అందులో ప్రేమ ఎక్కడుంది" అన్నట్టు వ్యాఖ్యానించారు.
సందీప్రెడ్డి వ్యాఖ్యలపై సమంత సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో 'అర్జున్రెడ్డి' అభిమానులు సమంతను టార్గెట్ చేశారు. అప్పట్లో సినిమా బాగుందని ట్వీట్ చేసిన సమంత, ఇప్పుడు దర్శకుణ్ణి తప్పుబడుతూ కామెంట్ చేయడం ద్వారా తన రెండు నాల్కల ధోరణి బయట పెట్టారని ఒక రేంజ్లో కామెంట్స్ చేశారు. వీటిపై సమంత వివరణ ఇచ్చారు. "నాకు 'అర్జున్రెడ్డి' కథ నచ్చింది. దానర్థం మనం ప్రేమించినవాళ్లను ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాదు" అని సమంత మరో ట్వీట్ చేశారు. అయినా... సెటైర్లు ఆగడం లేదు. 'రంగస్థలం'లో సమంతను రామ్ చరణ్ కొట్టే సీన్ బయటకు తీశారు. ఇదేంటి? అని సమంతపై సెటైర్స్ వేస్తున్నారు. సమంతకు మద్దతుగా మరికొందరు నిలుస్తున్నారు. అదీ సంగతి.
Also Read