సాయితేజ్తో మరోసారి రాశీఖన్నా?
on Jan 23, 2021
చిత్రలహరి, ప్రతి రోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల విజయాలతో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు యువ కథానాయకుడు సాయితేజ్. ప్రస్తుతం వెర్సటైల్ డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు సాయితేజ్. ప్రస్తుతం ఈ సినిమా.. చిత్రీకరణ దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే తో సుక్కు శిష్యుడు కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో తేజ్ ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. డిసెంబర్ 24న పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో సాయితేజ్ కి జోడీగా రాశీఖన్నా నటించబోతోందని సమాచారం. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సుప్రీమ్, ప్రతి రోజూ పండగే మంచి విజయం సాధించాయి. మరి.. రాబోయే సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.
త్వరలోనే సాయితేజ్ 15లో రాశీఖన్నా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.