పవన్ రూటులో రష్మిక...
on Jun 30, 2020
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక అలవాటు ఉంది. ప్రతి ఏడాది వేసవిలో తన ఫామ్ హౌస్ లో పండిన మామిడి పళ్ళను సన్నిహితులను, శ్రేయోభిలాషులకు పంపిస్తూ ఉంటారు. ఇదే రూటులో రష్మిక కూడా వెళుతోంది.
రష్మికది కర్ణాటకలోని కూర్గ్ ఏరియా. 'ఛలో'తో తెలుగు తెరకు పరిచయమై... 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాలతో భారీ విజయాలు అందుకున్న ఈ కన్నడ కుట్టి ఫ్యామిలీకి ఏరియాలో కాఫీ తోటలు, పంట పొలాలు ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో ఇంటి దగ్గరే ఉంటోందీ బ్యూటీ. తమ తోటలో పండిన మామిడి కాయలను సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి రష్మిక పంపించింది. ఆ గిఫ్ట్ హాంపర్ ను మహేష్ వైఫ్ నమ్రత ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పవన్ టైపులో రష్మిక కూడా ఇలా ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి జనాలకు పంపిస్తున్నారు అన్నమాట.
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్, రష్మిక జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆ పరిచయంతో మహేష్ ఫ్యామిలీకి మామిడికాయలు, పచ్చడి పంపించారు.