విరాటపర్వం బ్యాక్ డ్రాప్ ఏంటో తెలుసా!
on Jun 15, 2019
తండ్రి కొడుకుల మధ్య సాగే ఆసక్తికరమైన కథాంశంతో `నీదినాది ఒకే కథ`చిత్రాన్ని తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల. రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా `విరాట పర్వం` చిత్రం షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఇక ఈ సినిమా నక్సైలైట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. సినిమా అంతా ఒక రూరల్ ఏరియాలో జరుగుతుందట. రానా ఒక నక్సైలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి ఒక రూరల్ ఏరియాకు సంబంధించన అమ్మాయిగా నటిస్తుందట. అచ్చమైన తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ ఆమె పాత్ర చాలా నేచరల్ గా ఉండడోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకే సాయి పల్లవి పాత్ర హైలెట్ గా ఉండబోతుందట. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అందర్నీ కంటనీరు పెట్టించే విధంగా ఉంటాయట.
ఇక ఈ చిత్రం శనివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి దర్శకుడు వేణు ఊడుగులకి స్క్రిప్ట్ను అందించారు. ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, సాయిపల్లవి పాల్గొన్నారు. వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సురేష్బొ బ్బిలి సంగీతాన్ని, దివాకర్ మణి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకాలపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.