నెట్ఫ్లిక్స్లో నేరుగా రిలీజ్ కానున్న రకుల్ ప్రీత్ ఫిల్మ్!
on Nov 30, 2020
టాలీవుడ్లో ఏడేళ్ల కెరీర్ కంప్లీట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్లోనూ బిజీ అవుతోంది. ఆమె లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ 'సర్దార్ & గ్రాండ్సన్' థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా నవంబర్లో థియేటర్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికీ అవి 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. అయితే దీనివల్ల తమ సినిమాలకు నష్టాలే తప్ప లాభాలు ఉండవని గ్రహించిన నిర్మాతలు ఓటీటీ రిలీజ్లనే ఇష్టపడుతున్నారు.
ఇటీవల వరుణ్ ధావన్, సారా అలీఖాన్ కాంబినేషన్ ఫిల్మ్ 'కూలీ నంబర్ 1' సైతం ఓటీటీ రిలీజ్నే ఎంచుకుంది. అదే తరహాలో రకుల్ ప్రీత్ సింగ్, అర్జున్ కపూర్ జంటగా నటిస్తోన్న 'సర్దార్ & గ్రాండ్సన్'ను కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి రెండు నెలలు గడిచాయి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
50 శాతం ఆక్యుపెన్సీ రేట్తో థియేటర్లలో సినిమాని రిలీజ్ చేసి, రిస్క్ తీసుకోవాలని నిర్మాతలు భావించట్లేదు. 'సర్దార్ అండ్ గ్రాండ్సన్' మూవీ బడ్జెట్ రూ. 30 కోట్లు. నిఖిల్ అద్వానీ, జాన్ అబ్రహాం, భూషణ్ కుమార్ ఈ సినిమా నిర్మాతలు. నెట్ఫ్లిక్స్తో మంచి డీల్ కుదిరి, తమ పెట్టుబడికి తగ్గ రిటర్న్స్ వచ్చేట్లయితే ఆ ప్లాట్ఫామ్ మీదే రిలీజ్ చెయ్యాలని వారు భావించారు. ఇప్పటికే ఆ ఓటీటీ నుంచి వారికి మంచి అమౌంట్ అందినట్లు ప్రచారం జరుగుతోంది.
సీనియర్ డైరెక్టర్ శశిలాల్ నాయర్ కుమార్తె కాష్వీ నాయర్ డైరెక్టర్గా పరిచయమవుతున్న ఈ మూవీలో అదితిరావ్ హైదరి, జాన్ అబ్రహం అతిథి పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. రెండు భిన్న కాలాల మధ్య ప్రేమ, అనుబంధం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే జనవరిలో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.
Also Read