రాజమౌళి మాట మీద నిలబడతాడా?
on Sep 17, 2020
'బాహుబలి' భారీ విజయం తరవాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడు? ఎటువంటి సినిమా చేస్తాడు? అని దేశమంతా ఎదురు చూసింది. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూశారు. అసలు అసాధ్యం అనుకున్న కాంబినేషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను సుసాధ్యం చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. హిస్టారికల్ ఫాంటసీ ఫిలిం 'ఆర్ఆర్ఆర్' ప్రకటించాడు.
ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రెండేళ్లు పడుతుందని ఎవరూ అనుకోలేదు. రాజమౌళి కూడా త్వరగా ఫినిష్ చేస్తానని చెప్పాడు. కానీ, చేయలేకపోయాడు. అలా అలా సినిమా లేట్ అయింది. దానికి తోడు కరోనా వచ్చి పడింది. ఇప్పటికే యంగ్ ఆడియన్స్ లో మాంచి క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలు లాక్ అయిపోయారు. అభిమానులు కూడా తమ హీరోలు నుండి త్వరగా సినిమాలు వస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు. మిగతా దర్శకులు కూడా వాళ్ళిద్దరు కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకని, రాజమౌళి షూటింగ్ స్పీడ్ అప్ చేయాలని అనుకుంటున్నారు. ఫిబ్రవరికి ఎన్టీఆర్ షూటింగ్ పార్ట్, మార్చి కి రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి వాళ్ళిద్దరినీ ప్రాజెక్టు నుండి పంపిస్తానని మాట ఇచ్చాడట. మరి ఆ మాట మీద నిలబడతాడా లేదో చూడాలి.
ఎన్టీఆర్ రెడీ అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి త్రివిక్రమ్ రెడీగా ఉన్నారు. రామ్ చరణ్ వస్తే ఆచార్య కంప్లీట్ చేయాలి. ఆయనతో ఇద్దరు ముగ్గురు దర్శకులు డిస్కషన్ లో ఉన్నారు. ముందు ఎవరి ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుందో తెలుస్తుంది.
Also Read