రాజ్తరుణ్ సైలెంట్గా స్టార్ట్ చేశాడు
on Sep 21, 2020
'ఒరేయ్ బుజ్జిగా' విడుదలకు ముందే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్ళడానికి రాజ్ తరుణ్ రెడీ అయ్యాడు. సైలెంట్గా కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. స్నేహితుడు శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. సుప్రియ, నాగ సుశీల, అతికొద్ది మంది యూనిట్ సభ్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి.
రాజ్ తరుణ్ హీరోగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో 'సీతమ్మ అందాలు... రామయ్య సిత్రాలు' వచ్చింది. అది ఆశించిన విజయం సాధించలేదు. కానీ, స్నేహితుడి దర్శకత్వ ప్రతిభపై రాజ్ తరుణ్ మరోసారి నమ్మకం ఉంచాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా నిర్మిస్తోంది.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగును అక్టోబర్ మూడో వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండు నెలలలో సినిమాను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు అన్నీ తీసుకుని షూటింగ్ చేస్తారట. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించనున్నారు.
Also Read