'మహాసముద్రం'లో 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్!
on Sep 19, 2020
దర్శకుడిగా మొదటి సినిమా 'ఆర్ఎక్స్ 100'తో తనలో విషయం ఉందని నిరూపించుకున్న అజయ్ భూపతి, రెండో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి కొంత ఎక్కువ సమయం తీసుకున్నాడు. మొదటి రవితేజ దగ్గరకు వెళ్లడం, కొన్ని కారణాలతో కాంబినేషన్ సెట్ కాకపోవడం తెలిసిన విషయాలే. అవన్నీ పక్కన పెడితే అజయ్ భూపతి 'మహా సముద్రం'లో శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా నటించడానికి అంగీకరించారు. ఇద్దరూ నటిస్తున్న నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది కూడా! ఈ సినిమాలో హీరోయిన్గా నాని 'గ్యాంగ్ లీడర్' భామ ప్రియాంకా అరుల్ మోహన్ నటించనున్నదట.
'మహా సముద్రం'లో హీరోయిన్గా సమంత, సాయి పల్లవి, అదితి రావు హైదరి పేర్లు వినిపించాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం... వాళ్ళు ఎవరూ సినిమా చేయడం లేదు. ప్రియాంకా అరుల్ మోహన్ ను సెలెక్ట్ చేశారట. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. శర్వానంద్ సరసన 'శ్రీకారం'లో కూడా ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్.