క్రేజీ డైరెక్టర్.. ముగ్గురు హీరోల మల్టీస్టారర్!
on Dec 9, 2017
నిదానంగా తెలుగులో మల్టీస్టారర్ల ట్రెండ్ మొదలవుతుందండోయ్. ఆల్రెడీ... బాలయ్య, మహేశ్ సినిమా కన్ ఫాం అయ్యింది. ఇంతలోనే... తారక్, చర్రీ కాంబినేషన్లో రాజమౌళి సినిమా వార్త బయటకొచ్చేసింది. ప్రస్తుతం ఏ సినిమా సర్కిల్ లో చూసినా... ఈ రెండు సినిమాల గోలే. వీటితో పాటు మధ్యలో పానకంలో పుడకలా.. మరో మల్టీస్టారర్ కూడా రెడీ అవ్వబోతోంది.. అయితే.. వీళ్లు మరీ అంత పెద్ద స్టార్లు కాదు లేండి. ఇమేజ్ ఉన్న హీరోలే. వారే... నితిన్, రానా, నారా రోహిత్. వీరు ముగ్గురూ త్వరలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వీరి ముగ్గరినీ కలుపుతున్న దర్శకుడెవరో తెలుసా? ‘గరుడ వేగ’ తో భారీ విజయాన్ని అందుకున్న ప్రవీణ్ సత్తార్. ఇప్పటికే నితిన్ తో తాను ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు ప్రవీణ్. అలాగే నితిన్ కూడా ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో నటిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.
అయితే... ప్రవీణ్ తయారుచేసుకున్న కథలో మరో ఇద్దరు హీరోలకు కూడా స్థానం ఉంది. అందుకే... రానా ను కూడా కలిశాడట . 1945, మహరాజా ఆఫ్ ట్రవంకోర్ చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రం ‘హాథీ మేరా సాథీ’ సినిమాలతో బిజీగా ఉన్న రానా... ప్రవీణ్ చెప్పిన కథ విని.. ఉద్వేగానికి లోనయ్యాడట. దాంతో రానా కూడా ఇందులో నటించడం దాదాపు ఖరారైపోయింది. దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న రానా.. ఈ సినిమాలో నటించడం మార్కెట్ పై మంచి ప్రభావమే చూపుతుందనడంలో సందేహం లేదు. మూడో హీరోగా నారా రోహిత్ కూడా ఖరారైపోయాడట. విశేషం ఏంటేంటే... నితిన్ ని మినహాయిస్తే... రానా, నారా రోహిత్, ప్రవీణ్ సత్తార్ ముగ్గురూ మల్టీస్టారర్లకు పనిచేసిన వారే. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ లోనే ప్రవీణ్.