ఒకే చిత్రంలో పూజా హెగ్డే, రష్మిక?
on Dec 1, 2020
పూజా హెగ్డే, రష్మిక మందన్న.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్. అలాంటి ఈ ఇద్దరు ఒకే సినిమాలో నటిస్తే..? కుర్రకారుకి కనువిందే. అలాంటి విందును సిద్ధం చేస్తున్నారట టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి.
ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు, యూత్ ఐకాన్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి ఓ సినిమాని తెరకెక్కించనున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో దుల్కర్ కి జోడీగా పూజా హెగ్డే, రష్మిక మందన్న నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మేరకు ఒప్పందాలు కూడా పూర్తయ్యాయని టాలీవుడ్ బజ్.
దక్షిణాది నాలుగు భాషల్లోనూ విడుదల కానున్న ఈ పిరియడ్ రొమాంటిక్ సాగా.. వచ్చే సంవత్సరం ఆరంభంలో మొదలై, ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతమందించనున్నారు.