` సరిలేరు నీకెవ్వరు` కోసం ట్రైన్ సెట్!!
on Jul 6, 2019
మహేష్ బాబు, అనిల్ రావిపూడి కలయికలో `సరిలేరు నీకెవ్వరు` చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా కశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరించే పనిలో సినిమా యూనిట్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి ప్రజంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే... చిత్ర స్టోరికి సంబంధిచంఇ కశ్మీర్ నుంచి ఆంధ్రాకు రైలు లో ప్రయాణం చేసే సందర్భం ఒకటి ఉంటుందట. ఈ జర్నీలోనే రష్మికతో లవ్ లో పడతాడట మహేష్. ఈ నేపథ్యంలో ట్రైన్ లో చాలా సీన్స్ చాలా సరదాగా ఉంటాయట. ఈ ట్రైన్ ఎపిసోడ్ చాలా రోజులు ఉండటంతో ఒరిజినల్ ట్రైన్ లో షూట్ చేయడమంటే ఇబ్బంది అవుతుందని ట్రైన్ సెట్ అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో వేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో కంప్లీట్ అయిన వెంటనే ట్రైన్ సెట్ లో అగస్ట్ లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసారట చిత్ర యూనిట్. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు.