'లస్ట్ స్టోరీస్' డైరెక్టర్... తరుణ్ భాస్కర్!
on Oct 14, 2019
దర్శకురాలు నందినీరెడ్డి క్లారిటీ ఇచ్చారు... 'ఆల్రెడీ సబ్టైటిల్స్తో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'ను నెట్ఫ్లిక్స్ మళ్లీ ఎందుకు రీమేక్ చేయాలనుకుంటుంది? ఈ రూమర్స్ ఏంటో?' అని 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ కి నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు రాసినవారిపై సోషల్ మీడియాలో సెటైర్స్ వేశారు. దాంతో 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ ఉండదేమోనని చాలామంది అనుకున్నారు. నిజం ఏంటంటే... 'లస్ట్ స్టోరీస్' తెలుగులో రీమేక్ అవుతోంది. మరి, ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? అంటే.... తరుణ్ భాస్కర్. అవును... 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో న్యూ ఏజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ 'లస్ట్ స్టోరీస్' తెలుగు రీమేక్ కి డైరెక్టర్. ప్రస్తుతం ఈ దర్శకుడు హీరోగా నటించిన 'మీకు మాత్రమే చెప్తా' విడుదలకు రెడీ అవుతోంది. అది ప్రేక్షకుల ముందుకు వచ్చాక 'లస్ట్ స్టోరీస్' రీమేక్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే, 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ మీద కూడా తరుణ్ భాస్కర్ వర్క్ చేస్తున్నాడని తెలిసింది.