మళ్లీ తెరపైకి `భారతీయుడు-2`
on Jul 15, 2019
కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన `భారతీయుడు` చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా `భారతీయుడు -2` ను ప్రారంభించారు దర్శకుడు శంకర్. కొన్ని రోజుల షూటింగ్ కూడా చేసారు. అయితే సడన్ గా బడ్జెట్ ఆపేసారు. శంకర్ కు నిర్మాణ సంస్థ లైకా వారికి వచ్చిన బేదాభ్రిప్రాయాల వల్లే సినిమా ఆగిపోయిందంటూ ఆ మధ్య న్యూస్ వచ్చాయి. ఇక ఇతర సంస్థల్లో సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు చాలా ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడని తెలుస్తోంది. ఇక దీంతో లైకా వారు పెట్టిన బడ్జెట్ పరిమితుల్లోనే సినిమాను కంప్లీట్ చేయాలని భావించిన శంకర్ అగస్ట్ నుండి మళ్లీ షూటింగ్ ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీని పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తమిళ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.