మహేష్ హీరోయిన్ తో అఖిల్ రొమాన్స్!!
on Mar 20, 2019
గత ఏడాది సంచలన విజయం సాధించిన `భరత్ అనే నేను` తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. కియరా అద్వాని. మొదటి తెలుగు సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన పర్ ఫెక్ట్ జోడీ అనిపించుకుందీ ఈ ఉత్తరాది భామ. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన `వినయ విధేయ రామ` లోను తన గ్లామర్ తో మురిపించింది కియరా. ఇదిలా ఉంటే ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న కియరా అతి త్వరలో మరో తెలుగు సినిమాలో నటించబోతోందని టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే అక్కినేని వారి మూడో తరం కథానాయుకుడు అఖిల్ హీరోగా `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. కాగా ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా కియరా నటించబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. త్వరలోనే కియరా ఎంట్రీ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.