కీర్తి సురేశ్.. ముచ్చటగా మూడు!
on Mar 1, 2021
గత ఏడాది కీర్తి సురేశ్ రెండు సినిమాలతో పలకరించింది. ఆ చిత్రాలే.. `పెంగ్విన్`, `మిస్ ఇండియా`. ఈ రెండు కూడా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ నే. అంతేకాదు.. ఓటీటీ వేదికగానే నాలుగున్నర నెలల గ్యాప్ లో ఈ మూవీస్ స్ట్రీమ్ అయ్యాయి.
కట్ చేస్తే.. ఈ ఏడాది కీర్తి ఫుల్ జోష్ లో ఉంది. కేవలం ఫస్టాఫ్ లోనే అది కూడా వేసవిలో ముచ్చటగా మూడు సినిమాలతో సందడి చేయనుంది. మార్చి 26న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `రంగ్ దే` విడుదల కానుండగా.. మే 13న ఎపిక్ హిస్టరీ డ్రామా `మరక్కర్ అరబిక్ కడలింటే సింహం` రిలీజ్ కానుంది. `మరక్కర్` ప్రధానంగా మలయాళంలో రూపొందినా.. అన్ని భారతీయ భాషల్లోనూ జనం ముందుకు రానుంది. ఇక జూన్ 3న ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ `గుడ్ లక్ సఖి`తో పలకరించబోతోంది కీర్తి. థియేట్రికల్ రిలీజెస్ గానే రాబోతున్న ఈ మూడు సినిమాల్లోనూ ఒక దానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో దర్శనమివ్వబోతోంది ఈ సిల్వర్ స్క్రీన్ `మహానటి`.
మరి.. వేసవిలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ కీర్తికి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.