నేడు... పోలీస్ స్టేషన్కి కంగనా రనౌత్ రారు!
on Oct 26, 2020
కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ మీద ఈ నెల 23న ముంబైలో క్రిమినల్ కేసు నమోదు అయింది. సోదరీమణులు ఇద్దరికీ దేశంలోని వివిధ మతాలు, చట్టాలు, ప్రభుత్వ సంస్థలపై గౌరవం లేదని ఫిర్యాదులో ముంబైకి చెందిన న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. వాళ్ళిద్దరినీ విచారించడానికి కోర్టు సమన్లు జారీ చేసింది. ముంబై పోలీసుల ముందు విచారణకు ఈ నెల 26న (అనగా నేడు) కంగనా రనౌత్, 27న రంగోలి రావాలని ఆదేశించింది. అయితే, వాళ్ళిద్దరూ రావడం లేదు.
అవును... నేడు పోలీస్ స్టేషన్కి కంగనా రనౌత్ రారు! ఈ విషయాన్ని ఆమె న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ చెప్పారు. "నా క్లయింట్లు కంగనా రనౌత్, రంగోలి ఈ నెల 26, 27న పోలీస్ స్టేషన్ కి రారు. వారికి వచ్చిన సమాన్లకు నేను ప్రతిస్పందించాను. నవంబర్ 15 తరువాత విచారణకు హాజరు కావడానికి సమయం ఇవ్వమని కోరాను" అని రిజ్వాన్ తెలిపారు.