క్లైమాక్స్ అలా ఉంటే బావుండేది!
on Oct 4, 2017
‘జై లవకుశ’ సినిమాకు నెగిటీవ్ రివ్యూలు రాశారని మీడియా సమావేశంలో ఎన్టీయార్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పరుచూరి గోపలకృష్ణ స్పందిస్తూ.. ‘ఎన్టీయార్ రివ్యూల గురించి మాట్లాడకుండా ఉంటే బావుండేది’అన్నారు. ఇంకా చెబుతూ ‘రివ్యూలను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో మేం చేసిన సినిమాల విషయంలో కూడా ఇలాంటి రివ్యూలే వచ్చేవి. అయితే... ఇక్కడ జనాదరణే ప్రామాణికం. ఆ విషయం గమనించండి’ అన్నారు పరుచూరి.
‘ ‘ఖైదీ’ విడుదలైనప్పుడు ‘ద్వితీయార్థంలో అడవులపాలైన ‘ఖైదీ’ అని రాశారు. కానీ... ఆ సినిమా రోజు రోజుకీ... ప్రేక్షకాభిమానాన్ని పెంచుకుంటూ... శిఖరాగ్ర చిత్రంగా నిలిచింది. ఎమ్మెస్ రెడ్డిగారికి ‘పలనాటి సింహం’ చిత్రం 20వది. ఆ సినిమా విడుదలైనప్పుడు.. ‘కత్తి పట్టబోయి సుత్తి పట్టిన ‘పలనాటి సింహం’ అని హెడ్డింగ్ పెట్టి రివ్యూ రాశారు. కానీ.. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. సో... దీనిబట్టి మీకు అర్థమైందేంటి? రివ్యూ అనేది ఓ నామమాత్రపు ఎనాలసీస్. అంతే. ’
‘ ‘జై లవకుశ’ బావుంది కాబట్టే జనాలు చూశారు. అయితే... క్లయిమాక్స్ మరోలా ఉంటే బావుండేది. ‘జై’ పాత్రను చంపకుడా... ‘ఇక్కడ మనం అనేది అబద్ధం. నే..నే..నే..నేన్నది నిజం’ అని డైలాగ్ ఉంది కదా. దాన్ని చివర్లో... ‘ఇక్కడ నేను అనేది అబద్ధం. మ..మ..మ..మనం అనేది నిజం’ అని ‘జై’తో మార్చి చెప్పించి ఉంటే బావుండేది. అలాగే... ‘నా కోసం చావడానికే సిద్ధపడ్డ మిమ్మల్ని వదిలి నేనెందుకుంటానురా’అని ఎన్టీయార్ అనేట్టు చే్స్తే ఇంకా బావుండేది. ఆ తర్వాత ముగ్గురినీ ఒకే స్క్రీన్ లోకి ఫ్రీజ్ చేస్తే ఇంకా బావుండేది. అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.
Also Read