తేజ 'ష్ష్టోరీస్' చెబుతారా?
on Aug 11, 2020
శిష్యుడు రాకేష్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు తేజ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాని షూటింగ్ చేస్తున్నప్పుడే ఆయనకు కరోనా సోకింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే... ఆ వెబ్ సిరీస్కి రూపకర్త తేజ. ఆయనే నిర్మాత. దానికి 'ష్ష్టోరీస్' టైటిల్ అయితే బావుంటుందని అనుకుంటున్నారట. అదే టైటిల్ ఖరారు చేయవచ్చని సమాచారం. ఫ్యామిలీ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. ఓటీటీ వేదికలో విడుదల చేయడం కోసం దీనిని సిద్ధం చేస్తున్నారు.
వెబ్ సిరీస్ పక్కన పెట్టి సినిమా విషయానికి వస్తే... గోపీచంద్ హీరోగా 'అలిమేలు మంగ వెంకట రమణ', రానా హెర్గా 'రాక్షస రాజు రావణ' సినిమాలను తేజ ప్రకటించారు. ఈ నెలలో గోపీచంద్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఆయనకు కరోనా రావడంతో ప్రస్తుతం ఆ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన కోలుకున్న తరవాత కొత్తగా షెడ్యూల్ వేస్తారు.
Also Read