చిరు ఇంట వాళ్ళు ఏం చేశారో తెలుసా ?
on Nov 26, 2019
మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్' టెన్త్ యానివర్సరీ గ్రాండ్గా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా పరిశ్రమలకు చెందిన తారలు సుమారు 40మంది కొత్తగా రీమోడలింగ్ చేసిన చిరంజీవి ఇంటికి వచ్చారు. మోహన్ లాల్, నాగార్జున, వెంకటేష్, జయసుధ, జయప్రద, సుహాసిని, జాకీ ష్రాఫ్ మెగాస్టార్ ఇంట సందడి చేశారు. అసలు, ఈ పార్టీకి వచ్చిన అతిథులను ఎవరు కో ఆర్డినేట్ చేశారు? పార్టీ ఎలా జరిగింది? ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు ముగిసింది? అసలు, చిరు ఇంట స్టార్స్ అందరూ ఏం చేశారో తెలుసా?
ప్రతి ఏడాది 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్' రీయూనియన్ పార్టీ ఒక్కో థీమ్ ప్రకారం జరుగుతుంది. చిరంజీవి ఇంట్లో ఈ ఏడాది 'బ్లాక్ అండ్ గోల్డ్' థీమ్ ప్రకారం జరిగింది. పార్టీకి వచ్చిన అతిథులు అందరినీ సుహాసిని కో ఆర్డినేట్ చేశారు. కొందరు దుబాయ్, మరికొందరు అమెరికా నుండి వచ్చారు.
ఆదివారం రాత్రి సుమారు ఏడు గంటలకు పార్టీ మొదలైంది. పార్టీలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే తేడాలు లేకుండా అందరూ ఒక్కటిగా కలిసిపోయారు. నటీనటులుగా కాకుండా స్నేహితులుగా ముచ్చటించుకున్నారు. పాతస్మృతులను గుర్తు చేసుకున్నారు. జోకులు వేసుకున్నారు. నవ్వుకున్నారు. పాటలు పాడారు. డ్యాన్సులు వేశారు. తర్వాత అంత్యాక్షరి ఆడారు. ఒకరి పాటలను మరొకరు పాడారు. తెల్లవారుజాము వరకూ పార్టీ జరిగింది. పార్టీ మధ్యలో చిరంజీవి ఇంటికి రామ్ చరణ్ వచ్చారు. అందరినీ కలిసి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అందరూ టీ, కాఫీలు తాగారు. ఆరు గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేశారు. తర్వాత అందరూ తమ తమ ప్రాంతాలకు బయలుదేరారు.