నాన్న.. నేను సేమ్ టు సేమ్
on Nov 23, 2017
తండ్రి మాస్టర్ అయితే.. కొడుకు జిరాక్స్ అంటుంటారు చాలామంది. దానికి తగ్గట్టే ఉంది ఇక్కడున్న ఈ ఫొటో. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి అలా సరదాగా కాఫీడేకి వెళ్లి కాఫీ తాగుతూ దిగిన ఫోటో ఇది. ఇద్దరూ ఒకే డ్రస్ లో ఉండటం... ఇద్దరు ఒకేలా గుబురు గడ్డం పెంచుకోవడం.. అన్నింటినీ మించి ఇద్దరూ తండ్రీకొడుకులు కావడం.. ఇద్దరి మధ్య చక్కని పోలికలు కుదరడం.. ఇవన్నీ ఈ ఫోటోపై ఎక్కడ లేని క్రేజ్ ని తీసుకొచ్చాయ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో ఓ హాట్ టాపిక్. అసలు ఈ ఫోటో పూర్వాపరాల్లోకెళ్తే... తన తండ్రిని సరదాగా అలా కాఫీడేకి తీసుకెళ్లాలనుకున్నాడట చర్రీ. ఎంతో కష్టపడి మెగాస్టార్ ని కాఫీడే కి తీసుకెళ్లాడు. అక్కడే ఈ ఫోటో దిగారు. ఆ ఫోటోను చరణ్ నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... ‘నాన్ననేను సేమ్ టు సేమ్. మా ఇద్దరికీ ఇది కాఫీ టైమ్. ఎంతో కష్టపడి నాన్నను ఒప్పించి తీసుకొచ్చాను. ’ అని పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటో చూసి మురిసిపోవడం మెగా అభిమానుల వంతైంది.
ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ... ఉఫాసనా కూడా ఈ ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేసింది. ‘అమ్మానాన్నలతో గడిపే సమయం వెలకట్టలేనిది. ఈ తండ్రీ కొడుకులకు అదే పీల్ ని అనుభవిస్తున్నారు. సినిమా పందెంలో తండ్రితో పాటు కొడుకు కూడా అదే వేగంతో దూసుకుపోతున్నాడు’ అని ఓ కామెంట్ కూడా పెట్టింది. ఇది చూసి మెగాఫ్యాన్స్ మురిసిపోతున్నారంటే నమ్మండి. అసలు చిరు, చరణ్ గడ్డం ఎందుకు పెంచారు? అనే అనుమానం మీకు రావాలే! విషయం ఏంటంటే.. చర్రీ ప్రస్తుతం ‘రంగస్థలం’ షూటింగ్ పనిమీద ఉన్నాడు. ఇందులో తను గుబురు గడ్డంతో కనిపిస్తాడు. ఇక చిరు ‘సైరా’ సెట్స్ కెళ్లే సమయం ఆసన్నమైంది. అందులో కూడా మెగాస్టార్ గుబురు గడ్డంతోనే ఉంటాడు. అందుకోసమే..‘సైరా’ షూటింగ్ పూర్తయ్యేంతవరకూ... అంటే.. ఓ ఏడాది పాటు గుబురు గడ్డంలోనే ఉండబోతున్నాడు మెగాస్టార్. ఈ కారణం చేతే.. తండ్రీ కొడుకలు ఇద్దరూ గడ్డంతో ఉన్నారు. ఇక ఒకే రకం దుస్తులు వేసుకోవడం అనేది వాళ్లిద్దరూ సరదాా చేసిన పని. అదండీ విషయం.