'పిశాచి 2'లో దెయ్యంగా...
on Sep 21, 2020
తెలుగులో 'పిశాచి'గా విడుదలై మంచి విజయం సాధించిన తమిళ సినిమా 'పిసాసు'. దానికి మిస్కిన్ దర్శకుడు. హారర్ సినిమాలో డిఫరెంట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్
తెరకెక్కుతోంది. ఈ 'పిశాచి 2'లో స్టార్ సింగర్ కమ్ హీరోయిన్ ఆండ్రియా నటించనున్నారు. సినిమాలో ఆమెది దెయ్యం క్యారెక్టర్. నవంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట.
'పిశాచి' సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు బాలా నిర్మించారు. సీక్వెల్ కు కొత్త నిర్మాతలు వచ్చారు.
కార్తీ హీరోగా నటించిన 'యుగానికి ఒక్కడు' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆండ్రియా తెలుసు. కమల్ హాసన్ 'విశ్వరూపం', 'విశ్వరూపం 2' సినిమాల్లోనూ నటించారు. అయితే, ఆమె హారర్
సినిమాల స్పెషలిస్ట్గా మారుతున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. సుందర్ .సి దర్శకత్వం వహించిన 'చంద్రకళ', 'కళావతి', సిద్ధార్థ్ హీరోగా నటించిన 'గృహం' వంటి హారర్ సినిమాలు ఆండ్రియా చేశారు. అదీ సంగతి.