అల్లు హీరోతో 'విజేత' దర్శకుడి వెబ్ సిరీస్?
on Aug 11, 2020
చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన సినిమా 'విజేత'. దీంతో దర్శకుడు రాకేష్ శశి మెగా కాంపౌండ్లో అడుగు పెట్టాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మరో హీరోతో వెబ్ సిరీస్ చేయనున్నాడని టాక్. 'విజేత' సినిమా భారీ సక్సెస్ ఏమీ సాధించలేదు. కానీ, అతడు తీసిన విధానం నచ్చిన మెగా కాంపౌండ్ అతడికి మరో అవకాశం ఇచ్చిందని సమాచారం.
అల్లు శిరీష్ హీరోగా రాకేష్ శశి దర్శకత్వంలో మొదట సినిమా చేయాలని ప్లాన్ చేశారట. అయితే, ప్రజెంట్ సినిమా చేయడం కంటే వెబ్ సిరీస్ చేయడం బెటర్ అని అనుకుంటున్నారట. మోస్ట్లీ ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. శిరీష్ తండ్రి అరవింద్ ప్రొడ్యూస్ చేస్తారని సమాచారం. అల్లు హీరోతో 'విజేత' దర్శకుడు చేయబోయే వెబ్ సిరీస్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందట.
'ఆహా' కోసం ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుండి ఎవరు వెబ్ సిరీస్ చేయలేదు. అల్లు శిరీష్దే తొలి సిరీస్ అవుతుందేమో. చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల నిర్మిస్తున్న సిరీస్, జీ 5కి ఇచ్చారు.
Also Read