`మన్మథుడు-2` లో మరో అతిథి!!
on May 7, 2019
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున `మన్మథుడు-2` చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. `చిలసౌ` ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మన్మథుడు కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా మన్మథుడు సక్సెస్ ఫార్ములాని పాలో అవుతున్నట్లు సమాచారం అందుతోంది. అవును మన్మథుడు లో సోనాలి బింద్రే , అన్షు హీరోయిన్లు గా నటించారు. ఇక ఆ సినిమాలో హిట్ట్ సాంగ్ గా నిలిచిన `వద్దురా సోదరా` పాట లో కీర్తి చావ్లా, రేఖ గెస్ట్ పాత్రల్లో కనిపించారు. ఇక మన్మధుడు 2 విషయంలో కూడా దర్శకుడు అదే ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఒక స్పెషల్ క్యారక్టర్ బెంగుళూర్ బేబి అక్షర గౌడ్ కనిపించనుందట. ఇక స్టోరీకి ట్విస్ట్ గా వచ్చే పాత్రలో నాగ్ కోడలు సమంత కనిపిస్తోందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...ఇందులో మహానటి కీర్తి సురేష్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించనుందట. కీర్తి తో కలిపితే మొత్తం ఇందులో నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నారన్నమాట. మన్మథుడా మజాకా.