'మహాసముద్రం'లో మణిరత్నం హీరోయిన్!
on Aug 14, 2020
అదితి రావు హైదరి అంటే తెలుగు ప్రేక్షకులకు మణిరత్నం హీరోయినే. హిందీలో కథానాయికగా కొన్ని సినిమాలలో కీలక పాత్రల్లో సైతం నటించిన ఆమెను కార్తీ హీరోగా ఆయన తీసిన 'చెలియా' సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు అందమైన నాయికగా పరిచయం చేశారు. ఆ తర్వాత స్ట్రయిట్ తెలుగు సినిమా 'సమ్మోహనం'తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. నాని 'వి'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. క్రేజీ సినిమాలో కథానాయికగా అవకాశం వచ్చిందని తెలుస్తోంది.
'ఆర్ఎక్స్ 100'తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమాగా ఓ మల్టీస్టారర్ 'మహా సముద్రం' తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్ ఒక హీరో. సిద్ధార్థ్ మరో హీరో. ఈ చిత్రంలో శర్వా సరసన అదితి రావు హైదరిని కథానాయికగా సెలెక్ట్ చేశారట. కథ విని ఆమె ఓకే చేశారట. క్యారెక్టర్ నచ్చితేనే సినిమాకు సంతకం చేసే అదితీ చేస్తున్నారంటే 'మహా సముద్రం' సంథింగ్ స్పెషల్ గా ఉండొచ్చు.
Also Read