సునీల్ హీరోయిన్కి కరోనా
on Aug 14, 2020
హీరో ప్రభాస్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'బుజ్జిగాడు మేడిన్ చెన్నై'లో త్రిష చెల్లెలు పాత్రలో సంజన గల్రానీ నటించింది. తరవాత కొన్ని సినిమాలు చేసింది. ఆమె చెల్లెలు నిక్కీ గల్రానీ కూడా హీరోయినే. తెలుగులో సునీల్ సరసన 'కృష్ణాష్టమి'లో నటించింది. టాలీవుడ్ లో తక్కువ సినిమాలు చేసింది గానీ కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో దగ్గర దగ్గర 20 సినిమాలు చేసింది. ఆమెకు కరోనా వచ్చింది.
తాను కరోనా వైరస్ బారిన పడిన సంగతిని నిక్కీ గల్రానీ స్వయంగా వెల్లడించింది. "లాస్ట్ వీక్ నాకు కొవిడ్ 19 టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కరోనా చుట్టూ భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. కరోనా వ్యాధి లక్షణాలు నాలో స్వల్పంగా బయటపడ్డాయి. రుచి-వాసన తెలియకపోవడం, జ్వరం రావడం వంటివి అంతే. ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నా. బాగా రికవర్ అవుతున్నా" అని నిక్కీ గల్రానీ పేర్కొన్నారు. బయట పరిస్థితులు భయం కలిగించే విధంగా ఉన్నాయి కనుక అందరూ ఇంట్లో జాగ్రత్తగా ఉండమని సూచించారు.
Also Read