ట్విట్టర్కి ఖుష్బూ టాటా... ట్రోల్స్ ఎఫెక్ట్?
on Nov 16, 2019
సోషల్ నెట్వర్కింగ్ మీడియా ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీల్లో ఖుష్బూ ఒకరు. కథానాయికగా, నటిగా ఆమెకు ఎంత ఫాలోయింగ్ ఉందో... రాజకీయ నాయకురాలిగా కూడా ఆమెకు అంతే ఫాలోయింగ్ ఉంది. సమకాలీన రాజకీయ అంశాలు, సమస్యలపై ట్విట్టర్లో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు ఖుష్బూ వ్యక్తం చేస్తుంటారు. ఆమెకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. అటువంటి ఖుష్బూ ఉన్నట్టుండి ట్విట్టర్ నుండి వైదొలిగారు. ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేశారు. చెప్పాపెట్టకుండా ఇలా చేయడం చాలామందికి షాక్ ఇచ్చింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నాయకులను విమర్శించడానికి ఖుష్బూ ఏమాత్రం వెనుకాడరు. కాస్త కూడా ఆలోచించరు. బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ నాయకులకు ధీటుగా సమాధానాలు ఇస్తున్న కారణంగా ఆమెపై హిందూ వ్యతిరేకి అని కొందరు ముద్ర వేశారు. ఖుష్బూపై ట్రోల్స్ విపరీతంగా వస్తుంటాయి. ఈ కారణంగానే ఆమె ట్విట్టర్ నుండి వైదొలిగి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్విట్టర్ కు టాటా చెప్పేసినా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ను కొనసాగిస్తున్నారు ఖుష్బూ. ఇక నుండి అందులో అప్ డేట్స్ ఇస్తారేమో.