'పంజా' టైమ్లో పవన్కల్యాణ్ ముందే గొడవ
on Oct 14, 2019
పవన్కల్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తీసిన 'పంజా' ప్లాప్ కావొచ్చు. కానీ, ఆ సినిమాలో పవన్ స్టైల్, కాస్ట్యూమ్స్ సూపర్ హిట్. అందులో డైలాగులు కూడా హిట్టే. అబ్బూరి రవి 'సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు' వంటి అద్భుతమైన డైలాగులు రాశారు. అయితే... కొన్ని డైలాగులు విషయంలో దర్శకుడు విష్ణువర్ధన్తో గొడవ పడ్డారట. పవన్ కల్యాణ్ ముందే తనకు, దర్శకుడికి గొడవ జరిగిందని రీసెంట్ ఇంటర్వ్యూలో అబ్బూరి రవి చెప్పారు. కొన్ని డైలాగులు కొంతమందికి రాయకూడదని, ఏ డైలాగ్ ఎవరికి రాస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో దర్శకుడు, డైలాగ్ రైటర్ ఊహించగలగాలని ఆయన అన్నారు.
'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'తో విలన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న అబ్బూరి రవి, డైలాగ్ రైటర్గా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. దర్శకుడు కావాలనే కోరిక మనసులో బలంగా ఉందనీ, అయితే డైలాగ్ రైటర్గా బిజీగా ఉండటంతో ఇన్నాళ్లూ ఆ కోరికను పక్కన పెట్టాననీ, డైరెక్షన్ కోసం సొంత కథ రాసుకోవడానికి డైలాగ్ రైటర్గా సినిమాలు తాగించానని అబ్బూరి రవి తెలిపారు. దర్శకుడు సాయికిరణ్ అడివి కోసం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'లో విలన్ ఘాజీ బాబా పాత్ర చేశానన్నారు. తన నటన ఎలా ఉందో ఈ నెల 18న విడుదలవుతున్న సినిమా చూసి ప్రేక్షకులే చెప్పాలని అన్నారు.