అంత తొందరెందుకో.. నా బత్తాయి..?
on Nov 16, 2017
2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై తలో రకంగా స్పందిస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియా వేదికగా కొందరు తమ ఆనందాన్ని పంచుకుంటుంటే.. మరికొందరు ఏపీ సర్కార్పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. అవార్డుల్లో మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని.. ఏదో కంటితుడుపుగా చిరంజీవికి రఘపతి అవార్డు ఇచ్చారని మెగా ఫ్యాన్స్ రగిలిపోతుండగా.. ఎన్నో ఉత్తమ చిత్రాలు ఉండగా ఒక చిత్రానికే ఎక్కువ అవార్డులు ఇవ్వడమేంటని మరోక వర్గం బహిరంగంగానే విమర్శిస్తోంది.
తాజాగా హాస్యనటుడు థర్ట్ ఇయర్స్ ఇండస్ట్రీ అదేనండి మన పృధ్వీరాజ్ కూడా స్పందించాడు. లౌక్యం సినిమాలో తాను చేసిన పాత్రకు ఆడియన్స్ బాగా రెస్పాండ్ అయ్యారని.. దీంతో తనకు గ్యారెంటీగా నంది అవార్డ్ వస్తుందని అనుకున్నామని.. కానీ రాకపోవడం కాస్త బాధను కలిగించిందని అన్నాడు. అలాగే అవార్డులు ప్రతి సంవత్సరం ప్రకటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇలా మూడు, నాలుగేళ్లకు కలిపి ఒకేసారి ఇవ్వడం తనకు నచ్చలేదని.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు సబబుగా లేదంటూ కామెంట్ చేయడంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారాయి.