టైటిల్ అదిరిపోయింది బాబాయ్...
on May 24, 2018
ఆది పినిశెట్టి అటు తమిళ సినిమాలతో పాటు.. ఇక్కడ తెలుగు సినిమాలు కూడా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైనోడు సినిమాలో ప్రతి కథానాయకుడు పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ఆది.. ఇటీవల కాలంలో వచ్చిన నిన్నుకోరి, రంగస్థలం మంచి పాత్రలు చేయగా.. ఆ సినిమాలు కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరో తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ‘నీవెవరో’ టైటిల్ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్ను కథానాయకుడు నాని ట్విటర్లో విడుదల చేశారు. ‘ఆది కొత్త సినిమా టైటిల్ ‘నీవెవరో’. మా ప్రియమైన ‘అరుణ్’ నటించనున్న సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కోనవెంకట్, తాప్సి, రితికా సింగ్కు ఆల్ ది బెస్ట్’ అని పేర్కొన్నారు. అనంతరం ఆదికి ట్వీట్ చేస్తూ..‘నువ్వు చెప్పిన కథకు ఈ టైటిల్ అదిరిపోయింది బాబాయ్’ అని పేర్కొన్నారు.
కాగా హరినాథ్ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో ఆదికి జోడిగా తాప్సి, రితికా సింగ్ నటిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హాస్యనటుడు వెన్నెల కిశోర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.