తిట్టుకున్నారు సరే.. సినిమా వాళ్లను దిగజారుస్తారా..?
on Dec 15, 2017
కొద్దిరోజుల క్రితం తెలుగునాట ప్రముఖ మీడియా ఛానెల్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో.. నిర్మాత బండ్ల గణేశ్, ఎమ్మెల్యే రోజాల తిట్ల పురాణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అభిమాన హీరోను ఏదో అన్నారని ఒకరు.. తమ అధినేతను విమర్శించారని మరొకరు అసలు సంగతి పక్కనబెట్టి.. ఆవేశంలో వ్యక్తిగత విమర్శలకు దిగారు.
"పక్కలు అనే దాకా రోజా వెళితే.. "నువ్వు స్ట్రయిట్గా ఇండస్ట్రికి వచ్చావా" అంటూ బండ్ల అన్నాడు. ఒకరినొకరు తిట్టుకుని కోపమైతే తీర్చుకున్నారు.. మీడియా వాళ్లకి టీఆర్పీ.. మసాలా వార్తలు కావాల్సిన వారికి.. అది కావాల్సినంత అందింది. కానీ ఇప్పటికే ప్రజల్లో సినిమా ఇండస్ట్రీపై ఉన్న గౌరవం రోజు రోజుకి తగ్గిపోతుంటే.. ఈ తరహా వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమను అసహ్యించుకునే పరిస్థితిని కల్పిస్తోందని విమర్శకులు అంటున్నారు. చీకటి బాగోతాలు, తెర వెనుక కథలు చూసి చూసి.. తమ పిల్లలను సినిమా వైపు కన్నెత్తి కూడా చూడనివ్వడం లేదు తల్లిదండ్రులు. అలాంటప్పుడు తెలుగు చిత్ర సీమకు కొత్తరక్తం ఎలా వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసి రోజా, గణేశ్లు టాలీవుడ్కు ద్రోహం చేసినట్లే అంటున్నారు ఫిలింనగర్ జనాలు.
Also Read