ఆ వ్యవహారాలు చక్కబెట్టినందుకు ఛార్మికి 4 కోట్లిప్పించిన పూరి
on Jun 28, 2017
ఏ హీరోయిన్ అయినా అవకాశాలు తగ్గు ముఖం పట్టగానే ఏం చేస్తారు? మహా అయితే ఏ ఇతర పాత్రలు చేయడమో, లేదంటే శుబ్బరంగా ఏ బిజినెస్ మ్యాన్ నో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవడమో చేస్తారు. కానీ ఛార్మి ఇవేవీ కాకుండా డబ్బులు సంపాదించడానికి సరికొత్త మార్గం ఎన్నుకుంది. అలాగని, నిర్మాణ రంగంలో డబ్బులేం పెట్టుబడి పెట్టడం లేదండీ బాబూ. మరి ఇంతకీ ఛార్మి ఏం చేస్తుందనేకదా మీ సందేహం? పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేస్తున్న పైసా వసూల్ సినిమాకి ఛార్మి ప్రొడక్షన్ పనులు చూసుకుంటుంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఛార్మి పనేంటో తెలుసా? భవ్య క్రియేషన్స్ వాళ్ళు ఇచ్చిన 28 కోట్ల బడ్జెట్ ని సరిగ్గా వినియోగించి సినిమా పూర్తి చేయడం. బాలకృష్ణ, పూరి ఇంకా ఇతర నటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం కూడా ఈ బడ్జెట్ లోనే ఇంక్లూడ్ చేయబడుతుంది. సో, ప్రొడక్షన్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటున్నందుకు పూరి ఛార్మికి ఎంత రెమ్యూనరేషన్ మాట్లాడాడో తెలుసా? 4 కోట్లు. అవునండి హీరోయిన్ గా కూడా సంపాదించని డబ్బు ఈ కొత్త జాబ్ తో సంపాదిస్తుంది ఛార్మి. నిర్మాతలు కూడా పనిభారం తగ్గడం, అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తవుతుండడంతో ఛార్మి విషయంలో సంతృప్తిగానే ఉన్నారట. ఎందుకుండరు, ఇవ్వాళా రేపు అనుకున్న బడ్జెట్లో సినిమా తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా!