బాలయ్యని టార్గెట్ చేస్తున్నచరణ్?
on Dec 8, 2016
ఈ సంక్రాంతికి రెండు సినిమాలు రావడం ఖాయమైంది. ఒకటి నందమూరి బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి. మరోటి చిరంజీవి ఖైదీ నెం.150. ఈ రెండు సినిమాల్ని చూడ్డానికి తెలుగు ప్రేక్షకులు మరీ ముఖ్యంగా ఆయా హీరోల అభిమానులు ఫిక్సయిపోయారు. అయితే ఈ రెండు సినిమాలూ ఎప్పుడు విడుదల అవుతాయి? అనేదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. గౌతమి పుత్ర శాతకర్ణిని జనవరి 12న రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
దానికి ఓ రోజు ముందో, వెనుకో.. చిరు సినిమా రావాలి. అయితే.. రామ్చరణ్ మాత్రం గౌతమి పుత్ర రిలీజ్ రోజునే ఖైదీ నెం.150 విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే రిలీజ్ డేట్ ఇంకా స్పష్టంగా ప్రకటించడం లేదు. గౌతమి పుత్ర రిలీజ్ డేట్ తెలిశాక తమ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాలని చరణ్ భావిస్తున్నాడు. ఒకేరోజు రెండు సినిమాలు రావడం, అవీ అగ్ర కథానాయకులవి కావడం.. గొప్ప విశేషమే. థియేటర్లు కళకళలాడిపోతాయి.
అయితే.. సాంకేతికంగా చాలా సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరకడం కష్టం. దానికి తగ్గట్టు బాలయ్య - చిరులు కావాలనే పోటీ పడుతున్నారన్న తప్పుడు సంకేతాలు అభిమానులకు అందుతాయి. హీరోలు స్నేహంగా ఉన్నప్పుడే అభిమానులు కొట్టుకు చస్తున్నారు.. ఇలా పోటా పోటీగా బరిలోకి దిగితే ఇంకేమైనా ఉందా?? అయితే ఇవేం పట్టించుకోకుండా చరణ్ బాలయ్య సినిమాని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.