నాని హీరోయిన్లకు పవర్ స్టార్ బంపరాఫర్..
on Dec 4, 2016
నాని హీరోయిన్ లకు లక్ బాగానే కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 'నేను లోకల్' సినిమాలో నాని సరసన నటించిన కీర్తీ సురేశ్ పవన్కల్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఫిక్స్ అయింది. ఇప్పుడు 'మజ్ను' సినిమాలో భీమవరం అమ్మాయిగా నటించిన అను ఇమ్మాన్యుయేల్ కూడా లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాలోనే. కీర్తి సురేశ్ మొదటి హీరోయిన్ కాగా.. రెండో హీరోయిన్ గా అనుని ఎంపిక చేశారు. దీంతో అను ఇమ్మాన్యుయేల్ మంచి ఛాన్స్ కొట్టేసింది.. ఈ సినిమా ఆమె కెరీర్ కే మంచి ప్లస్ అవుతుందని అంటున్నారు. కాగా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిచనున్నారు. వి. మణికందన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి నాని హీరోయిన్స్ తక్కువ కాలంలోనే మంచి ఆఫర్ కొట్టేశారు.