షూటింగ్లో రకుల్కు యాక్సిడెంట్
on Oct 21, 2016
ప్రజంట్ టాలీవుడ్లో బిజీ హీరోయిన్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం రకుల్ ప్రీత్ సింగ్. వరుస పెట్టి స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది ఈ ఢిల్లీ బ్యూటీ. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో రకుల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రజంట్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. మురుగదాస్ మూవీలోని కీలక యాక్సన్ సీక్వెన్స్ని చిత్రీకరిస్తున్నాడు. ఈ యాక్షన్ సీక్వెల్స్లో భాగంగా రకుల్ గాయపడినట్టు సమాచారం. ఆమెకు స్వల్ప గాయాలయ్యాని..వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ రకుల్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది. కంగారు పడాల్సిన పని లేదని ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని తన కోసం ప్రార్థించిన వారందరికి ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపింది రకుల్.