మాస్ ఆడియన్స్ కోసం తమ్మన్నాని ఆడిస్తున్నారట..!
on Jul 23, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. వీరి అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే రిలీజైన టీజర్ కూడా సుమారు 50 లక్షల వ్యూస్ అందుకుని రికార్డ్ సృష్టించింది. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం తెలుస్తోంది. అదేమిటంటే.. ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తుండగా... మరో స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నారు. ఈ సాంగ్ ను కేవలం మాస్ ఆడియన్స్ కోసమే ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేసేందుకు సిద్ధ పడుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తొలుత ఆగస్ట్ 12 న విడుదల చెయ్యాలి అని భావించినప్పటికీ, నాణ్యమైన చిత్రాన్ని అందించటం కోసం మరొక మూడు వారాల గడువు తీసుకుంటున్నట్లు గా దర్శకులు కొరటాల శివ తెలిపారు. ఆగస్ట్ లో చిత్రం ఆడియో ఉంటుంది అని అన్నారు.