సముద్రంలో రకుల్ సాహసాలు మామూలుగా లేవు!
on Dec 1, 2020
కొన్ని రోజులు మాల్దీవుల్లో విహారయాత్రను ఎంజాయ్ చేసి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ అక్కడి జ్ఞాపకాలను తరచూ షేర్ చేసుకుంటూ వస్తున్నారు. లేటెస్ట్గా అక్కడ సముద్రంపై ఓ అనుభవానికి చెందిన ఓ పిక్చర్ను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. అందులో ఆమె ఫ్లై-బోర్డింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఆ ఫ్లై-బోర్డింగ్ తను అనుకున్నట్లు సునాయాసంగా లేదనీ, చాలా కష్టపడిందనీ, ఆ పిక్చర్కు పెట్టిన క్యాప్షన్ ద్వారా గ్రహించవచ్చు. "ఏడు సార్లు కిందపడ్డాను.. ఎనిమిదోసారి నిలబడిగలిగాను.. అట్లా మొత్తం ఇక్కడ 70 సార్లు కిందపడ్డాను" అంటూ దానికి హిలేరియస్ క్యాప్షన్ జోడించారు 30 ఏళ్ల రకుల్ ప్రీత్.
మాల్దీవుల్లో తన కుటుంబంతో కలిసి విహార యాత్ర చేసుకొచ్చారు రకుల్. అక్కడికి వెళ్లినా ఆమె వర్కవుట్స్ మానలేదు. వర్కవుట్ చేస్తున్న ఫొటోతో పాటు, సన్ బాత్ చేస్తున్న పిక్చర్, స్కూబా డైవింగ్, భోంచేస్తున్న పిక్చర్లను కూడా ఆమె షేర్ చేశారు.
ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో నితిన్ సరసన 'చెక్' మూవీ చేస్తున్నారు. దీనికి చంద్రశేఖర్ యేలేటి డైరెక్టర్. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఇంకా టైటిల్ నిర్ణయించని ఓ సినిమా పూర్తి చేశారు. కొండపొలం నవల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరో. అలాగే రెండు మూడు బాలీవుడ్ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.
Also Read