మరోసారి మెస్మరైజ్ చేసిన ధనుష్
on Apr 10, 2021
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే కోలీవుడ్ స్టార్స్ లో ధనుశ్ ఒకరు. అందుకే.. `ఆడుకలమ్`, `అసురన్` చిత్రాలతో రెండు సార్లు `ఉత్తమ నటుడు` విభాగంలో జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఈ టాలెంటెడ్ స్టార్. కమర్షియల్ గానూ ధనుశ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ఇక ఈ శుక్రవారం (ఏప్రిల్ 9) జనం ముందుకొచ్చిన `కర్ణన్` కూడా ధనుశ్ లోని ఉత్తమ నటుడిని ఆవిష్కరించింది. అదే విధంగా.. టికెట్ విండోస్ వద్ద మ్యాజిక్ చేస్తోంది.
తన ఊరి ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాటం చేసే ఓ యువకుడి కథగా `కర్ణన్` తెరకెక్కింది. ఇందులో టైటిల్ రోల్ లో నటించిన ధనుశ్ పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుంది. అనూహ్య మలుపులు, ఉద్వేగభరితమైన సన్నివేశాలతో సాగే ఈ చిత్రాన్ని తన అభినయంతో మరో స్థాయికి తీసుకెళ్ళారు ధనుశ్. మరోసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెస్మరైజ్ చేశారు. ప్రేక్షకులు, విమర్శకులు సైతం ధనుశ్ నటనని కొనియాడుతున్నారు.
మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన `కర్ణన్`లో కేరళకుట్టి రాజీషా విజయన్ నాయికగా నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
Also Read