'డిక్టేటర్' డైరెక్టర్తో మరోసారి బాలయ్య?
on Dec 1, 2020
బాలకృష్ణ కథానాయకుడిగా శ్రీవాస్ రూపొందించిన 'డిక్టేటర్' (2016) మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా ఆడింది. సంక్రాంతి స్టార్గా పేరుండటంతో ఆ ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని గట్టి నమ్మకంతో రిలీజ్ చేశారు. చంద్రశేఖర్ ధర్మా అలియాస్ చందూగా బాలకృష్ణ మంచి పర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ, ఎంటర్టైన్మెంట్ మిస్సవడం, సెకండాఫ్ బోరింగ్గా ఉండటం, మూసకథ కలిసి బాలయ్య 99వ సినిమా 'డిక్టేటర్'ను హిట్ చేయలేకపోయాయి.
అయినప్పటికీ, శ్రీవాస్ మీద మరోసారి బాలయ్య నమ్మకం ఉంచినట్లు ఫిల్మ్నగర్లో ప్రచారం జరుగుతోంది. అతను చెప్పిన కథ ఆయనను బాగా ఇంప్రెస్ చేసిందంటున్నారు. 'డిక్టేటర్' మూవీ తర్వాత శ్రీవాస్ తీసిన 'సాక్ష్యం' (2018) ఫ్లాపయ్యింది. అప్పట్నుంచీ ఇంతదాకా మరే స్టార్నూ శ్రీవాస్ తన కథతో మెప్పించలేకపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు బాలయ్యను ఒప్పించగలిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరింత సమాచారం వెల్లడి కావచ్చు.
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నాయికలుగా నటిస్తున్నారు. 2021 వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.