డీజే రెండో ట్రైలర్ ఎందుకు విడుదల చేసారో తెలుసా..
on Jun 13, 2017
నిర్మాత దిల్ రాజు తన ఆస్థానంలో పని చేసిన అందరు దర్శకుల్ని తన సంస్థ నుండి వస్తున్న 25 వ చిత్రం దువ్వాడ జగన్నాధం ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కి పిలిచి సినిమాపై బజ్ పెంచే ప్రయత్నం చేసారు. కానీ, అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఒక మోస్తరుగా ఉండడంతో దిల్ రాజు ప్లాన్ కాస్త బెడిసి కొట్టినట్టయింది. అందుకే దగ్గరుండి, రెండో ట్రైలర్ కట్ చేయించాడట. నిన్న డీజే ఆడియో రిలీజ్ వేడుకలో విడుదల చేసిన కొత్త ట్రైలర్ అన్ని వర్గాలకి నచ్చేలా ఉంది. మొదటి ట్రైలర్ లో కామెడీ పాళ్ళు తక్కువుండగా, రెండో ట్రైలర్ మాత్రం నవ్వులు కురిపించింది. అల్లు అర్జున్ చేసిన రెండు క్యారెక్టర్స్- అటు బ్రాహ్మణుడి అవతారంలో డీసెంట్ గా, ఇటు డీజే గా మాస్ క్లాస్ అని లేకుండా అన్ని వర్గాల్ని మెప్పించేలా అగుపించాయి. పూజా హెగ్డే గ్లామరస్ గా కనిపించగా, మెయిన్ విలన్ గా చేసిన రావు రమేష్ తన తండ్రి రావు గోపాల్ రావు ఆ ఒక్కటి అడక్కు సినిమా గెటప్ లో అలరించాడు. ఓవరాల్ గా మొదటి ట్రైలర్ లో ఉన్న లోపాలు సరిదిద్దినట్టుగా కనిపించిన రెండో ట్రైలర్ అన్ని అంశాల మేళవంగా ఉండి సినిమాపై హైప్ పెంచేసింది. ఇప్పటికే రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డీజే అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ హిట్టవుతుందనే రిపోర్ట్స్ వస్తున్నాయి.