Home »
నమ్రతా చేతిపైన మహేష్ బాబు
on Aug 31, 2014
టాలీవుడ్ లో టాటూల క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒంటిపై పచ్చబొట్టు పొడిపించున్న వారి జాబితాలో లేటెస్ట్ గా ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి, నమ్రతా శిరోద్కర్ కూడా చేరారు. నిన్న సాయంత్రం జరిగిన ‘ఆగడు’ ఆడియో రిలీజ్ కి మహేష్ తో కలిసి వచ్చారు. ఈ సందర్బంగా ఆమె కుడిచేతి మీద వున్న టాటూ బయటపడింది. తన కుడి చేతి పై మహేష్, గౌతమ్ సితార పేర్లను టాటూగ వేసుకుని తనకు తన కుటుంబం అంటే ఎంత ఇష్టమో మరోసారి తెలియజేసింది. ఈ టాటూని ఫోటోలు తీయడానికి మీడియా కెమెరాలు పోటీ పడ్డాయి.