.jpg)
'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ను బయటపెట్టింది.. ఆపై నాలుక కరుచుకుంది!
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ను జరుపుకుంటోంది. ఇటీవల ఈ విషయాన్ని తెలియజేస్తూ, రామరాజు, భీమ్ పాత్రధారులు చేతులు కలిపిన ఓ పిక్చర్ను రాజమౌళి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన విషయం తెలిసిందే.

రామ్.. సెంటిమెంట్ రిపీట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి అచ్చొచ్చిన సీజన్.. సంక్రాంతి. ఈ సీజన్ లో తన మొదటి సినిమా దేవదాసు (2006) రిలీజైంది. తొలుత డివైడ్ టాక్ వచ్చినా.. క్రమంగా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఆ తరువాత ఇదే ముగ్గుల పండగ టైమ్ లో మస్కా (2009) విడుదలైంది. తొలుత సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. అరుంధతి ప్రభావంతో హిట్ స్థాయికే పరిమితమైంది. ఆ తరువాత సంక్రాంతి సీజన్ లో భాగంగానే జనవరి 1న నేను శైలజ (2016)తో పలకరిస్తే.. ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది.

'బంగారు బుల్లోడు' మూవీ రివ్యూ
టీవీలలో, యూట్యూబ్ చానళ్లలో కామెడీ షోలు, కామెడీ సిరీస్ రావడం మొదలయ్యాక టాలీవుడ్ స్క్రీన్పై కామెడీ సినిమాల హవా తగ్గినట్లు అనిపిస్తుంది. కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ ఓ వెలుగు వెలిగారు. ఆయన తర్వాత ఆ ప్లేస్ను అల్లరి నరేశ్ ఆక్రమించేస్తాడని చాలా మంది ఊహించారు. 2012లో వచ్చిన 'సుడిగాడు' సినిమాతో నరేశ్ ఈ నమ్మకాన్ని ఎక్కువగా కలిగించాడు.

సలార్ కి కేజీఎఫ్ స్ట్రాటజీ..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా సలార్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ సాగా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హొంబళే ఫిల్మ్స్.. సలార్ ని నిర్మిస్తోంది.

ఇది విలువ కట్టలేని కౌగిలింత!
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒకరినొకరు గట్టిగా కౌగలించుకున్నారు. ఆ కౌగిలింత వెనుక ఉన్న ఎమోషన్ను ఎవరు విలువ కట్టగలరు! అవును. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న విజయం ఇవాళ దక్కితే ఆ ఆనందానుభూతిని వర్ణించడానికి ఎవరికి సాధ్యమవుతుంది! అలాంటి అనుభూతినే ఆ ఇద్దరూ పొందారు.

24న పెళ్లికొడుకవుతున్న బాలీవుడ్ స్టార్!
బాలీవుడ్ స్టార్ హీరో, యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న వరుణ్ ధావన్ రెండు రోజుల్లో పెళ్లి కొడుకు అవుతున్నాడు. జనవరి 24న ఆయన పెళ్లి ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్తో జరుగుతోంది. దానికి సంబంధించిన సందడి రెండు రోజుల ముందే ఈ రోజే మొదలైంది. చాలా రోజులుగా వరుణ్, నటాషా పెళ్లి వార్తల్లో నలుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.

ఊపిరి బిగబట్టేలా చేసిన 'లక్ష్య' టీజర్ రివ్యూ
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

"హ్యాపీ బర్త్డే బాస్ లేడీ".. నమ్రతకు మహేశ్ విషెస్!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మోస్ట్ లవబుల్ కపుల్స్లో మహేశ్, నమ్రతా శిరోద్కర్ కపుల్ ముందు వరుసలో ఉంటుంది. మహేశ్కు అమేజింగ్ లైఫ్ పార్టనర్ అయిన ఆమె ఇద్దరు పిల్లలకు తల్లిగా తన బాధ్యతలను గొప్పగా నిర్వర్తిస్తున్నారు. మహేశ్ స్టార్డమ్ వెనుక ఆయన స్వయంకృషి ఎంత ఉందో, భార్యగా నమ్రత సపోర్ట్ అంతగానూ ఉంది.

మద్రాస్ నుంచి హైదరాబాద్కు తరలివచ్చిన తొలి హీరో!
నేడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి. కేన్సర్తో బాధపడుతూ 2014 జనవరి 22న ఆయన తుదిశ్వాస విడిచారు. అక్కినేని అంత్యక్రియలను ఆయనకు ప్రాణప్రదమైన అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్వహించారు. ఆయనను చివరిసారిగా దర్శించుకోవడానికి వచ్చిన జన సందోహాన్ని అదుపుచేయడం పోలీసువారికీ కష్టమైంది.

ప్రభాస్ని ఢీ కొట్టబోతున్న విజయ్ సేతుపతి?
సలార్.. సాహో తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్. కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించనున్న ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. గోదావరిఖని కోల్ మైన్స్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఫిబ్రవరి తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.

'క్రాక్' విషయంలో దిల్ రాజుకు పరాభవం!
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా జనవరి 9న విడుదలైన 'క్రాక్' మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్టయింది. అయితే నైజాంలో ఈ సినిమాని బాగా ఆడుతున్న థియేటర్ల నుంచి తీసేసి పండగకు వచ్చిన వేరే సినిమాలకు కేటాయించారనీ, అంతగా ప్రాధాన్యం లేని థియేటర్లే తమకు ఇచ్చారనీ దిల్ రాజు, ఆయన కజిన్ శిరీష్లపై నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

అభినవ కర్ణుడు సోనూ సూద్కు హైకోర్టులోనూ చుక్కెదురు!
కరోనా మహమ్మారి కాలంలో దానకర్ణునిగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు సోనూ సూద్కు ఓ కేసు విషయంలో కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ముంబైలో అనధికారికంగా, అక్రమంగా భవనం నిర్మించారనే ఆరోపణతో బీఎంసీ (బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్) ఇచ్చిన నోటీసుకు వ్యతిరేకంగా సోను వేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు కొట్టివేసింది.

"రండి.. కూర్చోండి" అని చెప్పడానికి 16 టేకులు తీసుకుంది!
దక్షిణాది చిత్రసీమలోని శృంగార తారల్లో ఒకరిగా అనూరాధ పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో క్లబ్ సాంగ్స్ లేదా ఐటమ్ సాంగ్స్కు సిల్మ్ స్మిత లేదా డిస్కో శాంతి లేదా అనూరాధల్లో ఎవరో ఒకరో, ఇద్దరో ఉండాల్సిందే. అనూరాధ డాన్సర్గా ఎంత ఫేమస్సో, వ్యాంప్ రోల్స్కూ ఫేమస్. కొంత కాలం క్రితం టాలీవుడ్, కోలీవుడ్లలో ఐటమ్ గాళ్గా పేరు తెచ్చుకున్న అభినయశ్రీ ఆమె కూతురే.

పుష్ప.. ఇప్పుడు బాబీ డియోల్ వంతు!
రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ డైరెక్షన్ లోనూ.. అల వైకుంఠపురములో వంటి ఘనవిజయం తరువాత అల్లు అర్జున్ కథానాయకుడిగానూ రూపొందుతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో బన్నీ నెవర్ బిఫోర్ సీన్ రోల్, లుక్ లో దర్శనమివ్వబోతున్నారు.

లక్కీ మంత్లో రష్మిక హ్యాట్రిక్ ఎటెంప్ట్
చూసీ చూడంగనే తెలుగువారికి నచ్చేసిన చందనసీమ సోయగం.. రష్మిక మందన్న. ఛలోతో తెలుగు తెరకు పరిచయమైన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలతో ఇక్కడి వారికి మరింత చేరువైంది. ప్రస్తుతం ఈ అమ్మడు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప, యువ కథానాయకుడు శర్వానంద్ తో ఆడాళ్ళూ మీకు జోహార్లు చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నాయి.

కామెడీ తాతయ్య ఇకలేరు!
మలయాళం సినిమాలో కామెడీ తాతయ్యగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన దిగ్గజ నటులు ఉన్నికృష్ణన్ నూబుదిరి బుధవారం కేరళలోని తిరువనంతపురంలో కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిన ఆయన న్యుమోనియాతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం కన్నూర్లోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.

ఫిట్నెస్ గోల్స్.. మహేశ్ బాక్స్ జంప్స్!
హ్యాండ్సమ్నెస్, ఫిట్నెస్ రెండూ ఉండే ఫిల్మ్ స్టార్స్ తక్కువ మందే ఉంటారు. వారిలో ముందు వరుసలో ఉండే నటుడు మహేశ్. రోజు రోజుకూ మహేశ్ యంగ్గా, హ్యాండ్సమ్గా కనిపిస్తుంటాడని ఇటీవలే మంచు విష్ణు కామెంట్ చేసిన విషయం చూశాం. తెరపై తన బాడీని ఎక్స్పోజ్ చేయకపోయినా, అతని ఫిట్నెస్ ఎలా ఉంటుందో అతని ఫిజిక్ తెలియజేస్తూనే ఉంటుంది.

రవితేజ బర్త్ డేకి ఖిలాడి ట్రీట్ అదే!
రాజా ది గ్రేట్ తరువాత ట్రాక్ తప్పిన మాస్ మహారాజా రవితేజ కెరీర్.. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ క్రాక్ తో మళ్ళీ సక్సెస్ రూట్ లోకి వచ్చేసింది. ఒకవైపు ఈ ఘనవిజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఖిలాడి చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు రవితేజ. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.

అమెజాన్లో మాస్టర్ స్ట్రీమింగ్.. డేట్ ఫిక్స్
ఈ సంక్రాంతికి విడుదలైన కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మాస్టర్.. టాక్ తో సంబంధం లేకుండా దాదాపుగా విడుదలైన అన్ని చోట్ల లాభాల బాట పట్టింది. తెలుగునాట అయితే తొలి రోజే 80% రికవరీ అయి వార్తల్లో నిలిచింది. విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే డిజిటిల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోందట.

మహాశివరాత్రి కానుకగా మార్చి 11న 'శ్రీకారం'
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'శ్రీకారం'. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో హీరోయిన్గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న 'శ్రీకారం'ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు శనివారం చిత్ర బృందం ప్రకటించింది.

నితిన్ వర్సెస్ రష్మిక!
గత ఏడాది మహాశివరాత్రి స్పెషల్ గా ఫిబ్రవరి 21న విడుదలైన భీష్మ చిత్రంలో జంటగా కనువిందు చేశారు నితిన్, రష్మిక మందన్న. ఆ సినిమాలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించి.. క్యూటెస్ట్ హిట్ ని తమ కాంబో ఖాతాలో వేసుకున్నారు. కట్ చేస్తే.. ఏడాది తిరిగేసరికి ఈ ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద పోరుకి సిద్ధమయ్యారు.

జక్కన్న బర్త్ డే స్పెషల్ గా ఆర్ ఆర్ ఆర్?
డైరెక్టర్ నంబర్ వన్ ఎస్. ఎస్. రాజమౌళి ఇప్పటివరకు 11 సినిమాలను రూపొందించారు. అయితే, వీటిలో ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా జక్కన్న బర్త్ డ్ స్పెషల్ గా రిలీజ్ అయిన సందర్భం లేదు.

అనిల్ రావిపూడి దర్శకప్రస్థానానికి ఆరేళ్ళు
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు.. ఇలా డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమాతోనూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి అనిల్ రావిపూడి తొలిసారి మెగాఫోన్ పట్టి రూపొందించిన పటాస్ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఆరేళ్ళు. హిలేరియస్...

ఫిబ్రవరి 19న 'చెక్' చెప్పేందుకు నితిన్ రెడీ!
నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న 'చెక్' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, "జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ మధ్యకాలంలో ఈ నేపథ్యంలో సినిమా రాలేదు.
.jpg)
కత్రినా-సేతుపతి సినిమాకు ఇంటర్వెల్ ఉండదు!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఆసక్తికర కలయికలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. 'అంధూధున్' ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రేక్షకుల్ని మునివేళ్లపై కుర్చీల్లో కూర్చోపెట్టే థ్రిల్లర్గా ఇది రూపొందనున్నది. ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం పూణేలోని రియల్ లొకేషన్లలో జరగనున్నది.

నారప్పకి డేట్ ఫిక్స్ అయిందా?
గురు తరువాత విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం నారప్ప. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ అసురన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో వెంకీకి జోడీగా ప్రియమణి నాయికగా నటిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నారు...

సూర్యతో బోయపాటి యాక్షన్ డ్రామా?
మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ప్రస్తుతం తన లక్కీ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణతో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఉగాది కానుకగా ఏప్రిల్ లో విడుదల కానుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది....

బాలయ్య రీమిక్స్.. సేమ్ టు సేమ్
నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమాల్లోని పాటలు రీమిక్స్ అయిన సందర్భాలు తక్కువే. అయితే.. రీమిక్స్ చేసిన సినిమాలకు మంచి ఫలితాలే దక్కాయి. అలాంటి చిత్రాల్లో పటాస్ ఒకటి. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలయ్య నటించిన రౌడీ ఇన్స్ పెక్టర్ చిత్రంలోని అరె వో సాంబ పాటని రీమిక్స్ చేశాడు. కట్ చేస్తే.. చాన్నాళ్ళుగా సరైన విజయాలు లేని కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బస్టర్ దక్కింది. 2015 జనవరి 23న కళ్యాణ్ రామ్ కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ పటాస్ జనం ముందుకు వచ్చింది.

ఏఎన్నార్.. అత్యధిక పాత్రల రికార్డ్!
తెలుగు చిత్రసీమలో ఒకే చిత్రంలో అత్యధిక పాత్రలను పోషించిన రికార్డ్ ఎవర్గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరావు పేరు మీదే ఉంది. 1966లో వచ్చిన 'నవరాత్రి' చిత్రంలో ఆయన ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు. టైటిల్లోని నవ రాత్రుల్లో నవ పాత్రల్లో ఆయన దర్శనమిస్తారు.

అక్కడ్నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లిన సిరాజ్!
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్తోటే టెస్ట్ అరంగేట్రం చేసి, తొలి సిరీస్లోనే అదరగొట్టిన హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గురువారం హైదరాబాద్కు తిరిగొచ్చాడు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో అతనికి సాదర స్వాగతం లభించింది. అభిమానులు అతడిని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇంటికి కూడా వెళ్లకుండా సిరాజ్ నేరుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లి ఆయనకు నివాళులర్పించాడు.

తొలిసారి తెరపై కలిసి నటిస్తున్న కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి!
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె. అచ్చిరెడ్డి ద్వయం గురించి తెలియని సినీప్రియులు ఉండరు. ఆ ఇద్దరూ సినీ కృష్ణార్జునులుగా పేరు తెచ్చుకున్నారు. సన్నిహిత స్నేహితులైన ఆ ఇద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు. ఒకప్పుడు అగ్రశ్రేణి దర్శకునిగా రాణించిన కృష్ణారెడ్డి వెండితెరపై 'ఉగాది', 'అభిషేకం' చిత్రాల్లో హీరోగానూ కనిపించారు.

దుల్కర్తో హృతిక్ హీరోయిన్?
బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కి నటుడిగా మంచి పేరు తీసుకువచ్చిన చిత్రాల్లో సూపర్ 30 ఒకటి. 2019లో విడుదలైన ఈ సినిమాలో అతనికి జోడీగా మృణాళ్ ఠాకూర్ నటించింది. ఇక ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న జెర్సీ హిందీ రీమేక్ లోనూ షాహిద్ కపూర్ కి జంటగా ఈ టాలెంటెడ్ బ్యూటీనే నటించింది. ఇంతవరకు హిందీ, మరాఠి భాషల్లో నాయికగా అలరించిన మృణాళ్.. త్వరలో ఓ తెలుగు చిత్రంలో సందడి చేయనుందట.

అసిస్టెంట్ చేతిలో తన్నులు తిన్న స్టార్ డైరెక్టర్!
హృతిక్ రోషన్తో 'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్' లాంటి బ్లాక్బస్టర్ సినిమాలు తీసి, ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో 'పఠాన్' సినిమా చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. అతను ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చేతిలో దెబ్బలు తినడం టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. తెలుగు దర్శకుల్లో తేజకు ఎంత టెంపర్మెంట్ ఉందని పేరుందో, సిద్ధార్థ్ ఆనంద్కూ అంతే పేరుంది.

రాధేశ్యామ్.. పరమహంసగా రెబల్ స్టార్!
బిల్లా (2009), రెబల్ (2012) చిత్రాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలసి నటించి.. అభిమానులకు కనువిందు చేశారు. కట్ చేస్తే.. దాదాపు తొమిదేళ్ళ తరువాత ఈ ఇద్దరు మరో సినిమాలో కలసి నటిస్తున్నారు. ఆ చిత్రమే.. రాధేశ్యామ్. పిరియడ్ రొమాంటిక్ సాగాగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.

ముద్దివ్వడానికి సిగ్గుపడ్డ ఖిలాడీ కుమార్.. వదిలేసిన గాళ్ఫ్రెండ్!
బాలీవుడ్ ఖిలాడీ కుమార్గా పేరుపొందిన అక్షయ్ కుమార్ ఇటీవలే ట్వింకిల్ ఖన్నాతో 20వ పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. వారిది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. ఆమె కంటే ముందు పలువురితో డేటింగ్ చేశాడంటూ అక్షయ్పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వాటిలో రవీనా టాండన్తో ప్రేమ వ్యవహారం బాగా ఫేమస్.

ఆ బ్లాక్బస్టర్ సాంగ్ విడుదలైన 365 రోజులకు సినిమా విడుదల!
పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్తో హీరోగా పరిచయం అవుతున్నారు. సుకుమార్ దగ్గర 'ఆర్య 2', '1.. నేనొక్కడినే' చిత్రాలకు పనిచేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రదీప్ సరసన నాయికగా అమృతా అయ్యర్ నటించారు.

బోల్డ్ రోల్లో హద్దు దాటిన అనుపమ
ఇన్నాళ్ళు పద్ధతిగా ఉండే పాత్రల్లోనే కనిపిస్తూ వచ్చిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. తొలిసారి కాస్త హద్దు దాటి బోల్డ్ రోల్ లో దర్శనమిచ్చింది. అయితే అదేదో సినిమా కోసమో, వెబ్ సిరీస్ కోసమో కాదు. ఓ షార్ట్ ఫిల్మ్ కోసం. 29 నిమిషాల నిడివి ఉన్న ఆ లఘు చిత్రం పేరు.. ఫ్రీడమ్ @ మిడ్ నైట్. రెండే రెండు పాత్రలతో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ.. ఆరేళ్ళ పాపకు తల్లిగా గృహిణి పాత్రలో కనిపించింది.
Movie Reviews

2.00

2.50

2.00

3.00
Latest News
Video-Gossips
Gallery

'ఎఫ్సీయూకే' పాటలను విడుదల చేయనున్న కొవిడ్ హీరోలు
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా రూపొందుతున్న 'ఎఫ్సీయూకే' (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ వేసవిలో సందడంతా అక్కినేని హీరోలదే
2021 వేసవి అక్కినేని అభిమానులకు ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఈ సమ్మర్ సీజన్ లో ఈ ఫ్యామిలీ హీరోలు కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, యంగ్ హీరో అఖిల్.. ముగ్గురు కూడా తమ సినిమాలతో సందడి చేయనున్నారు.

సాయితేజ్తో మరోసారి రాశీఖన్నా?
చిత్రలహరి, ప్రతి రోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల విజయాలతో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు యువ కథానాయకుడు సాయితేజ్. ప్రస్తుతం వెర్సటైల్ డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు సాయితేజ్. ప్రస్తుతం ఈ సినిమా.. చిత్రీకరణ దశలో ఉంది.

అప్పుడు చరణ్.. ఇప్పుడు మోక్షజ్ఞ..
స్టార్ హీరోలతోనే కాదు యంగ్ హీరోల కాంబినేషన్ లోనూ జనరంజక చిత్రాలను అందించిన ఘనత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ది. అంతేకాదు.. స్టార్ కిడ్ లను కూడా పరిచయం చేసిన వైనం ఉంది. 2007లో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇలానే తెలుగు తెరకు చిరుతగా ఇంట్రడ్యూస్ చేశారు పూరి.

సునీత సంతోషానికి హద్దులు లేవు.. ఈ ఫొటోలే సాక్ష్యం!
గాయని సునీత జనవరి 9న మీడియా రంగంలో ఉన్న వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్లో నిశ్చితార్ధం జరిగిన దగ్గర్నుంచీ సునీత ఎంత ఆనందంగా ఉన్నారో పలు పొటోలు, వీడియోల ద్వారా మనం చూస్తూ వచ్చాం. కొంతమంది ఆమె అంత సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేక రకరకాలుగా మాట్లాడుకున్నారు.

మహాశివరాత్రికి శర్వానంద్ శ్రీకారం?
శతమానం భవతి తరహాలో పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంతో యువ కథానాయకుడు శర్వానంద్ చేస్తున్న చిత్రం శ్రీకారం. నూతన దర్శకుడు బి. కిషోర్ రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో శర్వానంద్ రైతు పాత్రలో దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం. అతనికి జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నాయికగా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఐదు చిత్రాలను టార్గెట్ చేసిన నాగశౌర్య
జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న యువ కథానాయకుల్లో నాగశౌర్య ఒకరు. ఛలో తరువాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం ఆరు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ఐదు సినిమాలు ఈ ఏడాదిలోనే తెరపైకి రానుండడం విశేషం.

జోడీ ఫిక్స్... డైరెక్టర్ ఛేంజ్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఓ హారర్ మూవీలో నటించబోతోందంటూ కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న సదరు సినిమాలో ఆమెకి జోడీగా మల్టిటాలెంటెడ్ ప్రభుదేవా నటిస్తాడని కూడా వినిపించింది. కట్ చేస్తే.. ఇప్పుడా సినిమాకి తాత్కాలికంగా బ్రేక్ పడిందని కోలీవుడ్ బజ్.

కేజీఎఫ్ ఛాప్టర్ 2: కొత్త రిలీజ్ డేట్
కేజీఎఫ్ ఛాప్టర్ 1 సెన్సేషనల్ హిట్ కావడంతో.. సహజంగానే అందరి కళ్ళు కేజీఎఫ్ ఛాప్టర్ 2పైనే ఉన్నాయి. రాఖీ బాయ్ యశ్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్.. యూట్యూబ్ ముంగిట సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీంతో.. స్కై హై ఎక్స్ పెక్టేషన్స్ ఈ సినిమా చుట్టూ ఉన్నాయి. దానికి తోడు ఛాప్టర్ 2లో ప్రముఖ బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ తో పాటు ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి హేమాహేమీలు నటించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

రెండు బ్లాక్బస్టర్ సాంగ్స్ని రెండు రోజుల్లో తీసేశారు!
నటసార్వభౌముడు ఎన్టీఆర్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 'అడవి రాముడు' (1977) సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అసామాన్యం. అత్యధిక రోజులు హౌస్ఫుల్స్లో ఏడాది పాటు థియేటర్లలో ఆడిన ఆ సినిమా సాధించిన కలెక్షన్లను నేటి కాలానికి లెక్కవేస్తే అది రూ. 500 కోట్లు అవుతుందని అంచనా.

మెగాస్టార్ 'లూసిఫర్' రీమేక్ స్క్రిప్ట్ రైటర్గా సత్యానంద్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 'లూసిఫర్' రీమేక్ లాంఛనంగా మొదలైంది. 'హనుమాన్ జంక్షన్' ఫేమ్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మూడు బేనర్లు కలిసి నిర్మిస్తున్నాయి. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందనుంది.

తమన్తో రీమేక్స్ కే ఫిక్సయిన మెగా బ్రదర్స్!
మెగా కాంపౌండ్ లో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కి మంచి ట్రాక్ రికార్డే ఉంది. నాయక్, రేసు గుర్రం, సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, తొలి ప్రేమ, ప్రతి రోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ తో పాటు తన కెరీర్ బెస్ట్ మూవీ అయిన అల వైకుంఠపురములో కూడా ఈ కాంపౌండ్ లో చేసిన సినిమాలే. అయితే ఇవన్నీ కూడా మెగా యంగ్ హీరోల (రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, అల్లు శిరీష్) కాంబినేషన్ లోనే వచ్చాయి.

సూర్యతో గ్యాంగ్ లీడర్ భామ?
నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో నటించిన గ్యాంగ్ లీడర్ తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ప్రియా అరుళ్ మోహన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శర్వానంద్ హీరోగా నటిస్తున్న శ్రీకారంతో పాటు కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న డాక్టర్ లోనూ నాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోనూ అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనే ప్రియ దర్శనమివ్వనుంది.
.jpg)
స్వీటీ.. ముచ్చటగా మూడోసారి?
లేడీ సూపర్ స్టార్ అనుష్కకి అచ్చొచ్చిన నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ఈ సంస్థ నిర్మించిన మొదటి సినిమా మిర్చిలో స్వీటీనే మెయిన్ లీడ్ గా నటించింది. అలాగే.. ఈ ప్రొడక్షన్ హౌస్ ఇంతవరకు నిర్మించిన ఏకైక మహిళా ప్రాధాన్య చిత్రం భాగమతిలోనూ అనుష్కనే లీడ్ రోల్. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. కట్ చేస్తే.. మూడేళ్ళ విరామం తరువాత స్వీటీ, యూవీ క్రియేషన్స్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని సమాచారం.

అలా మొదలైందికి పదేళ్ళు
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో అలా మొదలైంది ఒకటి. నందినీ రెడ్డి దర్శకురాలిగా పరిచయమైన ఈ సినిమాతోనే టాలెంటెడ్ యాక్ట్రస్ నిత్యా మీనన్ నాయికగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు.. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా రెండు పాటలు కూడా పాడి అప్పట్లో వార్తల్లో నిలిచింది నిత్య. అలాగే ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని కూడా అందుకుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అలా మొదలైందిని శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించారు. కళ్యాణి మాలిక్ స్వరాలు సమకూర్చారు.
TeluguOne Service
Customer Service
