సూపర్స్టార్ వదినగా పవర్స్టార్ మాజీ భార్య?
on Jan 5, 2021
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా ఈ నెల్లోనే సెట్స్ మీదకు వెళ్తోంది. మహేశ్ సరసన నాయికగా తొలిసారి కీర్తి సురేశ్ నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారనే వార్త. ఇదివరకు ఓసారి ఇలాంటి ప్రచారమే జరిగినప్పుడు ఆమె దాన్ని ఖండించారు. ఇప్పుడు మరోసారి ఈ వార్త గుప్పుమనడంతో అది నిజమేనని మహేశ్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఇంతకీ 'సర్కారు వారి పాట'లో ఆమెను ఎలాంటి పాత్ర కోసం దర్శకుడు పరశురామ్ సంప్రదించాడు? మహేశ్ వదిన పాత్ర కోసమనేది వినిపిస్తున్న ప్రచారం. ఇదే గనుక నిజమైతే.. పవన్ మాజీ భార్య మహేశ్కు వదినగా తెరమీద కనిపించనున్నారన్న మాట. ఇది మహేశ్ ఫ్యాన్స్కు ఎగ్జయిటింగ్ న్యూసే. రేణు దేశాయ్ ప్రస్తుతం 'ఆద్య' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. త్వరలోనే అది ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రత్యక్షమయ్యే అవకాశాలున్నాయి.
'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రి మూవీస్, 14 ప్లస్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్తుందని వినిపిస్తోంది. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనున్నది. ఈ సినిమా కోసం మహేశ్ జుట్టు పెంచి మేకోవర్ అయ్యారు.