‘అజ్ఙాతవాసి’ టీమ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటా!
on Jan 19, 2018
పుండు మీద కారం పెట్టినట్టు... అసలే... సినిమా డిజాస్టరై నిర్మాత, బయ్యర్లూ బాధలో మునిగిపోయుంటే... మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ‘నా సినిమాను నా పర్మిషన్ తీసుకోకుండా కాపీ కొట్టేసి.. కనీసం అపాలజీ అయినా చెప్పకుండా మౌనంగా ఉండిపోయిన ‘అజ్ఙాతవాసి’ టీమ్ పై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నా..’ అని ఫ్రెండ్ డైరెక్టర్ జెరోం సల్లే ట్వీట్టర్ ద్వారా తెలియజేసి.. ‘అజ్ఙాతవాసి’ టీమ్ కి కొత్త షాక్ ఇచ్చాడు. వివరాల్లోకెళ్తే..
తన సినిమా ‘లార్గో వించ్’ కథను కాపీ చేసి ‘అజ్ఙాతవాసి’ తీసినట్టు ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోం సల్లే గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల రోజునే ‘అజ్ఙాతవాసి’ సినిమా చూసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే... ఆయన ప్రకటనకు ‘అజ్ఙాతవాసి’ టీమ్ సమాధానం ఇవ్వలేదు
ప్రస్తుతం ‘లార్గో వించ్’ ఇండియా హక్కులు టీ సీరీస్ వారి దగ్గరున్నాయ్. వారికి త్రుణమో ఫలమో ముట్టజెప్పి.. సైలెంట్ గా ఉండిపోయారు దర్శక, నిర్మాతలు. డబ్బు తీసుకొని టీ సీరీస్ వారు కూడా సైలెంట్ అయిపోయారు. అయితే... మాతృక దర్శకుడు జెరోం లల్లే మాత్రం ఈ పరిణామాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.
‘లార్గో వించ్’ హక్కులు టీ సిరీస్ వారి వద్ద ఉన్న మాట నిజమే. అయితే.. వారి దగ్గరుంది కేవలం ఇండియా హక్కులు మాత్రమే. ‘అజ్ఙాతవాసి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కాబట్టి... మా అనుమతి కూడా అవసరం. కానీ... ‘అజ్ఙాతవాసి’ టీమ్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. కనీసం అపాలజీ అయినా చెప్పలేదు. ఇండియన్ సినిమాపై నాకు అమిత గౌరవం. కాపీ చేయకుండా క్రియేటివీటీతో సినిమాలు తీయగల సత్తా భారతీయ సినీ దర్శకులకు ఉంది. అయితే... ‘అజ్ఙాతవాసి’ టీమ్ నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రావడంలేదు. అందుకే.. నేను లీగల్ గా ప్రొసీడ్ అవ్వనున్నాను’ అని తేల్చిచెప్పేశాడు జెరోం సల్లే.
మరి ఈ గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. దెబ్బ మీద దెబ్బ తగలడం అంటే ఇదే.